Tuesday, January 28, 2020

కాశి పట్టణము

*కాశిలో ..చేయవలసినవి..చూడవలసినవి..!💐

ఓం నమః శివాయ..!!🙏

కాశీ లో ప్రవేశించగానే ముందుగా..
కాశీ విశ్వేశ్వరుని తలచుకుని, నమస్కరించుకుని
కాశీ నేలని తాకి నమస్కరించుకోవాలి.

బస చేరుకున్న తరువాత ముందుగా..
గంగా దర్శనం..గంగా స్నానం.
కాలభైరవుని దర్శనం
కాలభైరవుని గుడి వెనకాల దండపాణి గుడి దర్శనం డుంఠి గణపతి దర్శనం

కాశీ విశ్వేశ్వరుని దర్శనం
(ప్రొద్దున 4-00amకి తిరిగి సాయంత్రం 7-30pmకి స్పర్శ దర్శనం ఉంటుంది.)
కాశీ [భక్తులు దర్శనానికి వచ్చే దాన్ని బట్టి ఇది మారుతుంటుంది

అన్నపూర్ణ దర్శనం
భాస్కరాచార్య ప్రతిష్ఠిత శ్రీచక్ర లింగ దర్శనం (అన్నపూర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద కుడివైపు ఉంటుంది).

కాశీ విశాలాక్షి దర్శనం
వారాహి మాత గుడి
ఈ గుడి ప్రొద్దున 8-00 గంటల వరకే తెరిచి ఉంటుంది. లలిత ఘాట్ వద్ద నుండి వెళ్ళవచ్చు.
లేకపోతే విశాలాక్షి మాత గుడి వెనుకగా
వారాహి మాత గుడికి అడ్డ దారి ఉన్నది
ఇది చాలా దగ్గర దారి. ఎవరిని అడిగినా చెపుతారు.

మణికర్ణికా ఘట్టంలో స్నానం.
(వీలైతే మధ్యాహ్నం 12-00 గంటలకి)
గంగా హారతి -
దశాశ్వమేధ్ ఘాట్ వద్ద (అస్సి ఘాట్ వద్ద కూడా గంగా హారతి ఇస్తారు)
కేదార్ఘాట్ వద్ద కేదారేశ్వరుని దర్శనం
చింతామణి గణపతి దర్శనం
అస్సి ఘాట్ వద్ద ఉన్న లోలార్క కుండం లో స్నానం లేక ప్రోక్షణ
లోలార్కఈశ్వరుని దర్శనం
దుర్గా మందిరము
గవ్వలమ్మ గుడి
తులసీ మానస మందిరము
సంకట మోచన హనుమాన్ మందిరం.
తులసీ దాసుకు ఆంజనేయ స్వామి దర్శనం అయిన స్థలం.
తిలాభాండేశ్వర దర్శనం

వీలైతే సారనాధ్ స్థూపం బుద్ధ మందిరం -
ఇది కొంత దూరంగా ఉంటుంది.
ప్రత్యేకంగా వెళ్ళాలి. ఇది బట్టల షాపింగ్ సెంటర్.

గంగా నదీ ఘట్టాల దర్శనం -
అస్సి ఘాట్ నుండి మొదలు పెడితే వరుణ నాదీ సంగమం వద్ద ఉన్న ఆదికేశవ్ మందిరం దాకా వెళ్ళవచ్చు.

ఆదికేశవ స్వామి దర్శనం చేసుకోవాలి.
ఇదే విష్ణు మూర్తి ప్రథమంగా భూమి పై అవతరించిన చోటు.
గుడిలోకి వెళ్లి వస్తామని బోటు అతనితో ముందే మాట్లాడుకోవాలి.
లేకపోతె నదిలో నుంచే చూపించి వెనక్కి తిప్పుతారు.

బిందు మాధవుని గుడి -
ఇది పంచగంగ ఘాట్ వద్ద ఉన్న ఔరంగజేబు కోటకి దగ్గరలో ఉంటుంది.

ఓంకాళేశ్వర దర్శనం -
మెయిన్ రోడ్ నుండి కాల భైరవ స్వామి గుడి వైపు కాకుండా Left side రోడ్ లో వెళ్ళాలి.
రిక్షా అయితే మంచిది.
ఇవి రెండు మందిరాలు, ఉకారేశ్వరుడు మకారేశ్వరుడు చిన్నగా ఉంటాయి
కానీ ఇవి రెండూ కూడా స్వయంభూ లింగాలు.

కృత్తివాసేశ్వర లింగం -
ఓంకాళేశ్వర స్వామి దర్శనం అయిన తరువాత ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే కృత్తివాసేశ్వర లింగం వస్తుంది. ఇది అన్ని కాలలలోను చల్లగా ఉంటుంది.
స్వయంభూ లింగం.
కృత్తివాసేశ్వర లింగం దర్శనం అయినా తరువాత
ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే
మహా మృత్యుంజయలింగం దర్షించుకోవాలి.

బనారస్ హిందూ విశ్వవిద్యాలయం + అక్కడి నూతన విశ్వనాథ, దుర్గా లక్ష్మి నారాయణ గుడి సముదాయం

వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల..
స్థలాలు..💐
విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద
మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్
ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్
కుక్కుటేశ్వరుడు - దుర్గా కుండ్
త్రి పరమేశ్వరుడు - దుర్గా కుండ్
కాల మాధవుడు - కథ్ కీ హవేలీ
ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్
అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్
ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్
ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్
పరమేశ్వరుడు - శంక్తా ఘాట్
హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ
వశిష్టేశ్వరుడు - శంక్తా జీ
కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్
నీల కంఠేశ్వరుడు - నీల కంఠా
ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా
కాశేశ్వరుడు - త్రిలోచన్
శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్
శుక్రేశ్వరుడు - కాళికా గలీ

వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో
అవిముక్తక..
ఆనందకానన..
మహాస్మశాన..
సురధాన..
బ్రహ్మవర్ధ..
సుదర్శన..
రమ్య..
కాశి..అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

ఋగ్వేదంలో ఈ నగరాన్ని "కాశి", "జ్యోతి స్థానం" అని ప్రస్తావించారు.

స్కాంద పురాణంలోని కాశీఖండంలో ఈ నగర మహాత్మ్యం గురించిన వర్ణన ఉంది.
ఒక శ్లోకంలో శివుడు ఇలా అన్నాడు
ముల్లోకాలు నాకు నివాసమే.
అందులో కాశీ క్షేత్రం నా మందిరం

గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు.
ఈ హారతి దృశ్యాలను ప్రతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు.
వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.

అయోధ్య,
మథుర,
గయ,
కాశి,
అవంతిక,
కంచి,
ద్వారక
నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం

"కాశి,
కాంచి,
మాయ,
ఆయోధ్య,
ఆవంతిక,
మథుర మరియు
ద్వారవతి" లు
సప్త మోక్షపురులు గా పేర్కొనబడ్డాయి.

కాశి, ఆయోధ్య మరియు మథుర మోక్ష క్షేత్రాలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్నాయి.

ద్వారవతి (ద్వారక) మోక్షపురి గుజరాత్ రాష్ట్రం లో ఉంది.

మాయ (హరిద్వార్) మోక్షపురి ఉత్తరాఖండ్ లేక ఉత్తరాంచల్ రాష్ట్రం లో ఉంది.

ఆవంతిక (ఉజ్జయిని) మోక్షపురి మధ్య ఫ్రదేశ్ రాష్ట్రం లో ఉంది.

కాంచి మోక్షపురి తమిళనాడు రాష్ట్రం లో ఉంది.

కాశి,మాయ, ఆయోధ్య, ఆవంతిక,మథుర మరియు ద్వారవతి మోక్షపురులు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి.
కాంచి మోక్షపురి దక్షిణ భారతదేశంలో ఉంది.

దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం.

🙏ఓం నమః శివాయ🙏

కాశి పట్టణము

*కాశిలో ..చేయవలసినవి..చూడవలసినవి..!💐

ఓం నమః శివాయ..!!🙏

కాశీ లో ప్రవేశించగానే ముందుగా..
కాశీ విశ్వేశ్వరుని తలచుకుని, నమస్కరించుకుని
కాశీ నేలని తాకి నమస్కరించుకోవాలి.

బస చేరుకున్న తరువాత ముందుగా..
గంగా దర్శనం..గంగా స్నానం.
కాలభైరవుని దర్శనం
కాలభైరవుని గుడి వెనకాల దండపాణి గుడి దర్శనం డుంఠి గణపతి దర్శనం

కాశీ విశ్వేశ్వరుని దర్శనం
(ప్రొద్దున 4-00amకి తిరిగి సాయంత్రం 7-30pmకి స్పర్శ దర్శనం ఉంటుంది.)
కాశీ [భక్తులు దర్శనానికి వచ్చే దాన్ని బట్టి ఇది మారుతుంటుంది

అన్నపూర్ణ దర్శనం
భాస్కరాచార్య ప్రతిష్ఠిత శ్రీచక్ర లింగ దర్శనం (అన్నపూర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద కుడివైపు ఉంటుంది).

కాశీ విశాలాక్షి దర్శనం
వారాహి మాత గుడి
ఈ గుడి ప్రొద్దున 8-00 గంటల వరకే తెరిచి ఉంటుంది. లలిత ఘాట్ వద్ద నుండి వెళ్ళవచ్చు.
లేకపోతే విశాలాక్షి మాత గుడి వెనుకగా
వారాహి మాత గుడికి అడ్డ దారి ఉన్నది
ఇది చాలా దగ్గర దారి. ఎవరిని అడిగినా చెపుతారు.

మణికర్ణికా ఘట్టంలో స్నానం.
(వీలైతే మధ్యాహ్నం 12-00 గంటలకి)
గంగా హారతి -
దశాశ్వమేధ్ ఘాట్ వద్ద (అస్సి ఘాట్ వద్ద కూడా గంగా హారతి ఇస్తారు)
కేదార్ఘాట్ వద్ద కేదారేశ్వరుని దర్శనం
చింతామణి గణపతి దర్శనం
అస్సి ఘాట్ వద్ద ఉన్న లోలార్క కుండం లో స్నానం లేక ప్రోక్షణ
లోలార్కఈశ్వరుని దర్శనం
దుర్గా మందిరము
గవ్వలమ్మ గుడి
తులసీ మానస మందిరము
సంకట మోచన హనుమాన్ మందిరం.
తులసీ దాసుకు ఆంజనేయ స్వామి దర్శనం అయిన స్థలం.
తిలాభాండేశ్వర దర్శనం

వీలైతే సారనాధ్ స్థూపం బుద్ధ మందిరం -
ఇది కొంత దూరంగా ఉంటుంది.
ప్రత్యేకంగా వెళ్ళాలి. ఇది బట్టల షాపింగ్ సెంటర్.

గంగా నదీ ఘట్టాల దర్శనం -
అస్సి ఘాట్ నుండి మొదలు పెడితే వరుణ నాదీ సంగమం వద్ద ఉన్న ఆదికేశవ్ మందిరం దాకా వెళ్ళవచ్చు.

ఆదికేశవ స్వామి దర్శనం చేసుకోవాలి.
ఇదే విష్ణు మూర్తి ప్రథమంగా భూమి పై అవతరించిన చోటు.
గుడిలోకి వెళ్లి వస్తామని బోటు అతనితో ముందే మాట్లాడుకోవాలి.
లేకపోతె నదిలో నుంచే చూపించి వెనక్కి తిప్పుతారు.

బిందు మాధవుని గుడి -
ఇది పంచగంగ ఘాట్ వద్ద ఉన్న ఔరంగజేబు కోటకి దగ్గరలో ఉంటుంది.

ఓంకాళేశ్వర దర్శనం -
మెయిన్ రోడ్ నుండి కాల భైరవ స్వామి గుడి వైపు కాకుండా Left side రోడ్ లో వెళ్ళాలి.
రిక్షా అయితే మంచిది.
ఇవి రెండు మందిరాలు, ఉకారేశ్వరుడు మకారేశ్వరుడు చిన్నగా ఉంటాయి
కానీ ఇవి రెండూ కూడా స్వయంభూ లింగాలు.

కృత్తివాసేశ్వర లింగం -
ఓంకాళేశ్వర స్వామి దర్శనం అయిన తరువాత ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే కృత్తివాసేశ్వర లింగం వస్తుంది. ఇది అన్ని కాలలలోను చల్లగా ఉంటుంది.
స్వయంభూ లింగం.
కృత్తివాసేశ్వర లింగం దర్శనం అయినా తరువాత
ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే
మహా మృత్యుంజయలింగం దర్షించుకోవాలి.

బనారస్ హిందూ విశ్వవిద్యాలయం + అక్కడి నూతన విశ్వనాథ, దుర్గా లక్ష్మి నారాయణ గుడి సముదాయం

వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల..
స్థలాలు..💐
విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద
మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్
ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్
కుక్కుటేశ్వరుడు - దుర్గా కుండ్
త్రి పరమేశ్వరుడు - దుర్గా కుండ్
కాల మాధవుడు - కథ్ కీ హవేలీ
ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్
అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్
ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్
ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్
పరమేశ్వరుడు - శంక్తా ఘాట్
హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ
వశిష్టేశ్వరుడు - శంక్తా జీ
కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్
నీల కంఠేశ్వరుడు - నీల కంఠా
ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా
కాశేశ్వరుడు - త్రిలోచన్
శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్
శుక్రేశ్వరుడు - కాళికా గలీ

వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో
అవిముక్తక..
ఆనందకానన..
మహాస్మశాన..
సురధాన..
బ్రహ్మవర్ధ..
సుదర్శన..
రమ్య..
కాశి..అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

ఋగ్వేదంలో ఈ నగరాన్ని "కాశి", "జ్యోతి స్థానం" అని ప్రస్తావించారు.

స్కాంద పురాణంలోని కాశీఖండంలో ఈ నగర మహాత్మ్యం గురించిన వర్ణన ఉంది.
ఒక శ్లోకంలో శివుడు ఇలా అన్నాడు
ముల్లోకాలు నాకు నివాసమే.
అందులో కాశీ క్షేత్రం నా మందిరం

గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు.
ఈ హారతి దృశ్యాలను ప్రతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు.
వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.

అయోధ్య,
మథుర,
గయ,
కాశి,
అవంతిక,
కంచి,
ద్వారక
నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం

"కాశి,
కాంచి,
మాయ,
ఆయోధ్య,
ఆవంతిక,
మథుర మరియు
ద్వారవతి" లు
సప్త మోక్షపురులు గా పేర్కొనబడ్డాయి.

కాశి, ఆయోధ్య మరియు మథుర మోక్ష క్షేత్రాలు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్నాయి.

ద్వారవతి (ద్వారక) మోక్షపురి గుజరాత్ రాష్ట్రం లో ఉంది.

మాయ (హరిద్వార్) మోక్షపురి ఉత్తరాఖండ్ లేక ఉత్తరాంచల్ రాష్ట్రం లో ఉంది.

ఆవంతిక (ఉజ్జయిని) మోక్షపురి మధ్య ఫ్రదేశ్ రాష్ట్రం లో ఉంది.

కాంచి మోక్షపురి తమిళనాడు రాష్ట్రం లో ఉంది.

కాశి,మాయ, ఆయోధ్య, ఆవంతిక,మథుర మరియు ద్వారవతి మోక్షపురులు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి.
కాంచి మోక్షపురి దక్షిణ భారతదేశంలో ఉంది.

దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం.

🙏ఓం నమః శివాయ🙏

మహాభారతం లో ద్రౌపది

#ద్రౌపది :-

మహాభారతంలో ఒక ప్రత్యేకమైన పాత్ర.
ఈవిడ గురించి సద్విమర్శలు ఎన్ని ఉంటాయో దుర్విమర్శలు కూడా కొన్ని ఉంటాయి.
అది ఆవిడ పాత్ర వైశిష్ట్యం.
మహాభారతం గురించి తెలిపే రచయితల రచనా కౌశలానికి పదునుపెట్టే ఒక ప్రత్యేక పాత్ర ఈమె సొంతం.
ఆమె గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

#నారదపురాణం ప్రకారం :-

యముని భార్య శ్యామల

వాయువు భార్య భారతి

ఇంద్రుని భార్య శచీదేవి

అశ్విని దేవతల భార్య ఉష

వారివారి కర్తవ్య నిర్వహణ లోపం వలన భూమి మీద జన్మించండని బ్రహ్మ శపించాడట. వీరు వారి అంశలన్నీ ఒకచోట నిక్షిప్తం చేసి ద్రౌపదిగా యజ్ఞకుండం లోనుండి ప్రభవించినది గా చెపుతారు.
అందుకే

శ్యామల లోని -  ధర్మత, కారుణ్యం,క్రమశిక్షణ

భారతి లోని -  తెగింపు

శచీదేవి లోని -  వైభవం ఆక్రోశం

ఉష లోని -  అందం,లాలిత్యం,కోమలత్వం

ఉన్నాయని చెపుతారు.

 మరొక వివరణ ప్రకారం :-
〰️〰️〰️〰️〰️〰️〰️

1️⃣.ఇంద్రాణి అయిన శచీదేవి కర్మఫల వశాన

2️⃣.ఇంద్రసేన అను మౌద్గల్యుని భార్యగా జన్మించి అనంతరం

3️⃣.కాశీరాజు పుత్రికగా జనించి

...పంచకృత్త్వ స్త్వయోక్తోహం పతిం దేహీతి వై పునః |
...తత్తథా భవితా భద్రే!వచస్తద్భద్ర మశ్నుతే ||

ఐదుసార్లు పతినిమ్మని కోరావు కనుక మరుజన్మలో ఐదుగురు భర్తలను పొందగలవు అని శివుని చే వరం పొంది 🛐

4️⃣.ద్రౌపది గా తరువాత జన్మ లో ద్రుపదునికి అయోజనిగా యజ్ఞకుండం ♨️ నుండి జన్మిస్తుంది.

పాండవుల పూర్వ చరిత్ర :-
〰️〰️〰️〰️〰️〰️〰️

పూర్వం ఇంద్రుడు పురోహితుడైన విశ్వరూపుని అతని కుమారుడైన వృతాసురుని చంపడం వలన
అతనిలోని

ధర్మ గుణం యమునిలోనూ

బలగుణం వాయువు లోనూ

రూప లావణ్యాలు అశ్వనిదేవతలలోనూ
చేరతాయి

ఈ నాలుగు అంశాలతో ఐదవరూపం తో మనుష్యజన్మ ఎత్తమని శివుడు ఇంద్రుని శపిస్తాడు.

పాండవులలో పంచభూత ప్రాధాన్యత :-
➖➖➖➖➖➖➖➖➖

ఇంద్రుని యొక్క పాంభౌతిక తత్వాలు

☸️

ధర్మః పృథ్వ్యనిలో భీమః
జలం పార్థో నలం స్ప్మృతః |
నకులః రూపతశ్చాగ్నేః
సమదేవో నభస్ప్మ్తృతః ||

☸️

౼ మార్కండేయ పురాణం

పృథ్విభాగం - ధర్మరాజు 🎲

వాయుతత్వం - భీముడు 🏋️

జలాంశం - అర్జునుడు 🎯

అగ్నితత్వం - నకులుడు 🏇

ఆకాశభాగం - సహదేవుడు 🤺
గాను

జన్మించారని చెపుతారు.

మరొకవివరణ ప్రకారం :-
〰️〰️〰️〰️〰️〰️

1️⃣.దేవలోక అధిపతి అయిన ఇంద్రుడు శాప వశాన

2️⃣.మౌద్గల్యుని గా జన్మించి ఇంద్రసేన ను వివాహమాడి అనంతరం

3️⃣.కాశీరాజ పుత్రికకు వరప్రభావంచే

4️⃣.పంచపాండవుల రూపం లో జనించి ద్రౌపది రూపం లో ఉన్న శచీదేవి ని వివాహమాడతాడు.

పంచభర్తృత్వం పై వ్యాసమహర్షి వివరణ:-
✳️✳️✳️✳️✳️✳️✳️✳️

తనకూతురైన ద్రౌపదిని పంచపాండవుల కు ఇచ్చి ఎలా వివాహం చేయాలి ఇది ధర్మసమ్మతమేనా⁉️ అని ఆలోచిస్తున్న ద్రుపదునికి పాండవులు ఇంద్రుని అంశలే అను రహస్యం ను వ్యాస మహర్షి దివ్య దృష్టి ద్వారా ద్రుపదునికి తెలియచేస్తాడు.

⚛️

ఇదం చాన్యత్ప్రీతి పూర్వం నరేన్ద్ర దదామితే దివ్య మత్యద్భుతం చ |
దివ్యం చక్షుః కుంతీసుతాంస్త్వం పుణ్యైర్దివ్యైః పూర్వరూపై రుపేతాన్ ||

⚛️

అంతేకాక ఐదుగురు భర్తలు ఉన్ననూ కన్యాత్వ భంగం కలుగకుండా పతిశుశ్రూష సిధ్ధిని సౌభాగ్యం ను శివునిచే వరంగా పొందింది అని తెలియచేస్తాడు.

.....పంచభిః ప్రాప్య కౌమారం మహాభాగా భవిష్యసి ||

ఇటువంటి ద్రౌపది చేతనే పరమాత్మ  పెద్దల పట్ల అతిథుల పట్ల ఏవిధంగా మెలగాలో పాతివ్రత్య  ధర్మాలను తెలియచేశాడు.

అరణ్యవాసం చేస్తున్న కాలంలో ఒకనాడు సత్యభామ శ్రీకృష్ణుని తోకలసి వారిని చూడడానికి వచ్చినపుడు ద్రౌపది తో ఈవిధంగా తన సందేహం వెలిబుచ్చుతుంది.
అతిపరాక్రమవంతులైన నీ భర్తలు నీ ఎడల సమానమైన ప్రేమ గౌరవాన్ని ఎలా చూపగలుగుతున్నారు? వారిమధ్య ఆ సయోధ్య ఉండడానికి నీవు ఏ ఏ ఉపాయాలు చేస్తావో తనకు తెలుపమని అడుగుతుంది.

అపుడు
భర్తలపట్లే కాక అతిథి అభ్యాగతుల పట్ల పెద్దవారి పట్ల ఎలా మెలగాలో తెల్పుతుంది.

☯️

స్నాన భోజన శయనాది సంప్రయోగ
మర్థి బతుకులకు మున్నెందు నాచరింప
బతులు వచ్చిన నాసన పాద్య విధుల
భక్తితో నేన కావింతు బనుప నొరుల

☯️

➡️ వారికి స్నాన భోజనాలను 🍱 నేనే స్వయంగా దగ్గరుండి చూసుకొంటాను.

➡️ గురు బ్రహ్మణ దైవ అతిథులకు స్వయంగా నేనే పూజలు నిర్వహిస్తాను.

➡️ అత్తగారికి 👵 సేవ చేస్తూ సంతోషం  కలిగిస్తాను.

➡️ అసాధ్వులతో పరిహాసాలు స్నేహం  కలహం కాని చేయను.

➡️ ధర్మరాజు సహపంక్తి లో నిత్యం భొంజనం చేసే వేలాది అతిథులకు వస్త్రభూషణాది బహుమానాలను నేనే విచారించి అందచేస్తాను.

➡️ నమ్మకులైన పరిచారకులను స్వయంగా విచారించి నియమిస్తాను.

➡️ భాండాగారం 🏦 లో ఉండే ధన దినసరి ఆదాయ వ్యయాలు💰💲  అన్నీ క్షుణ్ణంగా నాకు తెలుసు.

ఈవిధంగా నా భర్తలకు ప్రియం చేకూర్చుతాను.

అంతేకాక భర్తమనసు ను ఆకర్షించడానికి ఉపాయాలు కూడా చెపుతుంది.

✡️

పతిగడవంగ దైవతము భామలకెందునులేదు
ప్రీతుడై సతీ గరుడించెనేని గల భాషిణీ
భాసుర భూషణాంబురా న్విత ధనధాన్య గౌరవము
విశ్రుత సంతతియున్ యశంబు సద్గతియును గల్గు
నొండు మెయిగల్గునే యిన్ని తెరంగు లారయన్

✡️

▶️ నిత్యము భర్త మనసెరిగి మంచి భావన తో ప్రియమైన పనులు చేస్తుండు.

▶️ ఇంటికి రాగానే ఎదురెళ్ళి ఆప్యాయంగా పలకరించి అవసరమైన పనులు పనివాళ్ళకు అప్పచెప్పకుండా నీవే దగ్గరుండి చేయి.

▶️ అతడు నీతో ఇష్టంగా చెప్పిన సంగతులు ఎవరికీ చెప్పవద్దు.

▶️ భర్తకు ముఖ్యులైన వారి పట్ల భక్తితో సపరిచర్యలు చేయి.

▶️ ఆయనకు ఇష్టం లేనివారు నీకు ఎంత కావలసిన వారు అయినా దగ్గరకు రానీయకు.

▶️ కులవతులు సతులు నిర్మలవంతులైన మగువలతోనే స్నేహం చేయాలి.

▶️ దురభిమానాన్ని వదలి పెట్టాలి.

ఈవిధంగా చేస్తే ఏ భర్త అయినా ఆ భార్యను తప్ప పరకాంత వైపు కన్నెత్తైనా చూడడు.

అని పతిసేవ అతిథి అభ్యాగతుల సేవను గురించి ద్రౌపది ద్వారా మనకు వివరిస్తాడు.

✅....ఈవిధంగా పంచభౌతిక అంశాత్మక ఇంద్రుడు పాండవులరూపం తో  ద్రౌపదిరూపంలోని శచీదేవిని వివాహం చేసుకొంటాడు....✅ 🆗

ఇది అర్థం చేసుకోలేని కొందరు వితండవాదం 🤷🤦 మరియు దుర్విమర్శలు చేస్తుంటారు.

అంతేకాక

దుష్టశిక్షణ చేయవలసిన పాండవులు శాంతికాములై ఉన్నారు.
వారు దుష్టశిక్షణ చేయాలంటే విపరీతమైన సంఘటన ద్వారా కొపోద్రిక్తులు 😤😠 కావాలి.
పాండవులు కోపోద్రిక్తులగుటకు తద్వార దుష్టశిక్షణ జరిగి భూభారం తగ్గిచడంలో ఆ జగన్నాటక సుత్రధారి ఆడించిన ఒక నాటకమే ద్రౌపది వస్త్రాపహరణం.
 తద్వార పాండవులు శపథాలు చేసి భూభారం తగ్గించారు. అదేవిధంగా తన భక్తురాలైన ద్రౌపదిని శ్రీకృష్ణరూపంలో శీలభంగం కాకుండా కాపాడగలిగాడు.

ఏదిఏమైనా

ఏకోణం నుండి చూసినా మచ్చలేని 💯 పాత్ర  ద్రౌపది.
ఆమెలో మచ్చకనపడే వారిలో అర్థ రాహిత్యం తప్ప మరోటికాదు.

ఆమె అభిజాత్యానికి ఆలవాలం
సౌందర్య సౌశీల్యాల పుట్టిల్లు
వివేక విజ్ఞాన విద్యా సంపదల సమాహారం.
రాజకీయాలు కరతలామలకం
పాతివ్రత్యానికి పట్టుకొమ్మ
నిఖిల సద్గుణాలకు సారూప్యం.
ద్రౌపది పాత్రను వేదవ్యాసుడు అత్యధ్బుతంగా తెలియచేశాడు.
దానికి మన కవిత్రయం (ముఖ్యంగా తిక్కన) మరింత మెరుగులు దిద్దారు.

అంత సాధ్వీమణి కనుకే



.....అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా।
.....పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్‌।।



అంటే, అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరీ ఈ అయిదుగురు పుణ్యమూర్తులనూ ప్రతిరోజూ స్మరించినంతనే పాపాలు నాశనమవుతాయని పంచ మహాపతివ్రతలలో ఒకరిగా ద్రౌపది ని చెప్తారు.  భావం.

.
.

నేను ఇంతకు ముందు ద్రౌపది పంచభర్తృత్వం అని ఒక సంకలనం రాశాను. కానీ అందులో ఎందుకో 🤔 కొంత అసంతృప్తి ఉంది. 😒
ఆ తర్వాత  యార్లగడ్డ లక్షీ ప్రసాద్ గారి చే రచించబడిన #ద్రౌపది పుస్తకం 📗  కొన్ని సందేహాలను తీర్చింది.
కానీ ఆ పుస్తకం ఎలానో పోగొట్టుకున్నాను.😥  ఆతర్వాత కొన్నాళ్లు కు ఈ పుస్తకం 📙 దొరికి మరికొన్ని సందేహాలను తీర్చింది.

ద్రౌపది by డా. కోడూరు ప్రభాకర రెడ్డి గారు.

భోజనం

ఈ కాలం బఫె భోజనాలగురించి వ్యంగ్యగా వ్రాశారు.డా.పొన్నాడ కృష్ణసుబ్బారావు   గారు. 
శ్రీ సుబ్బారావుగారికి  కృతజ్ఞతలతో .

"యజమానికి సంతోషం లేదు
అతిధికి ఆనందం లేదు"

రుచులవి జాతివి మారెను/
పచనపు కళ మారిపోయి పడమటి వంటల్ /.
కిచెనుల దూరెను మెల్లగ/
శుచియగు మన భావములను శూన్యము చేయన్

గుత్తి వంకాయ కూరా లేదు ,
గుమ్మడికాయ పులుసూ లేదు !
అరటికాయ వేపుడు లేదు ,
అదిరే కొబ్బరి చట్నీ లేదు !
కొత్తావకాయ ఊసే లేదు ,
కొత్తిమీర చారూలేదు !
కందా బచ్చలి మరిచారయ్యా !
గుమ్మడి వడియం విడిచారయ్యా !

పలావు వుందని వడ్డించారు !
ఉల్లీరైతా ఉందన్నారు !
రుచిపచి తెలీని 'కూరే' సారు !
మిక్సుడు పికిల్ కూరేసారు !
బూరీ గారీ నోదిలేసారు !
బూందీ లడ్డూ మార్చేశారు !

గులాబు జామూన్ ఉందన్నారు
లైనులో జనాలు ముందున్నారు !

అయిసు క్రీముకేసడిగేసాకా ,
అయిపోయుంటుందన్నారొకరు !
ప్లేటుని చేతిలో పట్టుకుని ,
ఓ చేతిని జేబులొ పెట్టుకుని ,
బఫే లైనులో నుంచుంటే ,
బఫూన్ లా భలేగా వుంది !

కుర్చీ బల్లా తీసేశారు !
కుదురుగ నిలుచుని తినమన్నారు !
తల్లీ పిల్లా తల్లడిల్లినా ,
ముసలీ ముతకా ముక్కి చూసినా !
బఫే తీరులో బలముందన్నారు !
గొర్రె మూక విని తలవంచారు !

పెద్దా చిన్నా పరుగులె పరుగులు !
ముద్ద కోసమొక యుద్దపు తలపులు !

*సాపాటు--గ్రహపాటు*

ఔనండీ సుబ్రహ్మణ్యం గారు
అది బఫే మీల్స్ కాదు
బఫెల్లో మీల్స్

దానికి తోడు
హనుమంతుడు
సంజీవ పర్వతం మోస్తున్నట్టు
చేతిలో బరువైన ప్లేటు

ఏ ఐటమ్ కి అది కొద్దిగా
పెట్టించు కుందామంటే
కొండ వీటి చాంతాడు
లాంటి లైను,

ఎంగిలి ప్లేటుతో
ఈదుకుంటూ ప్రయాణం
ఎడమ చేతి బరువు.

లంక మేత గోదారీత లా
మంచినీళ్ళు ఎక్కడో.

మధ్యలో ఆద మరిస్తే
ఏ పిల్లాడో/పిల్లో/పెద్దో
మనకి ఎవరు డాష్ ఇస్తారో

కొంచెం వేగంగా నడిస్తే
ఈ చలవరాతి ప్లోరింగ్ పై
పడిన నీటి చుక్కలకి
నడుం జారుతుందో

వండే వాడెవడో
వడ్డించేవాడెవడో

చక్కగా తిందామంటే
నలుగురికి పరిచయమైన
వారికి కత్తి సామే

ఎవరో ఒకరి పనికి
మాలిన ముచ్చట్లు

ఎక్కడేమున్నాయో
తెలవక అర్ధాకలితో
భోజనం ముగింపు

చెత్త కాయితాలేరుకునే
వాడిలా ఎక్కడ ఏమి
ఉన్నాయో

చూసుకుంటూ
తిరుక్కుంటూ
అభోజనం.

నిజమే నిలబడి
భోజనం నిజంగా
నాగరికుల దౌర్భాగ్యం

అందుకే వెళ్ళక పోతే
ఎవరితో కలవమనుకుంటారు
కనుక ఇంట్లోనే తిని వెళ్ళాలి
అందరితో కలిసి భోజనం చేయాలి
కాదు కాదు చేసినట్లు నటించాలి

పేరుకు విందు దానికి ఓ టైము
కరెక్ట్ టైముకు వెలితే ఎవరూ ఉండరూ,

అలా అని ఆలశ్యంగా
వెళితే పదార్ధాలు నిండుకుండు
నిలబడి పెట్టే భోజనం

యజమానికి సంతోషం లేదు
అతిధికి ఆనందం లేదు

నిజంగా కూర్చుని తినే పంక్తి భోజనం దొరకటం ఈ రోజుల్లో
చాల అదృష్టం.
భోజన కాలే హరి నామ స్మరణ
గోవిందా గోవింద.🚶🚶🚶

Wednesday, January 8, 2020

కొన్ని విషయాలు

అష్టదిగ్గజాలు అనేది ఒక పురాణగాధ మాత్రమేనా? అవి ఊహాజనితాలా? లేక నిజంగా ఏమైనా సంకేతార్ధం వున్నదా?సనాతన ధర్మం # 2

భూమి పొరల్లో పైనున్నది భూపటలం (Crust). ఈ భూపటలం అగ్ని శిలలు (Igneous rocks), అవక్షేప శిలలు (Sedimentary rocks), రూపాంతర శిలలతో (Metamorphic rocks) కూడి ఉంటుంది, సముద్రాల కింద 5 నుండి 12 కిలోమీటర్లలోతువరకు – అదే భూఖండాల కిందనైతే 35 నుండి 60 కిలోమీటర్ల లోతువరకూ ఉంటుంది. భూపటలం క్రింద ఉండేది భూప్రావారం (Mantle); దాని క్రిందిది భూకేంద్రము లేదా కేంద్ర మండలం (Core).
భూపటలం ఇంకా భూప్రావార పైపొరలను కలిపి శిలావరణం (Lithosphere) అంటారు. ఈ శిలావరణం క్రిందనుండే దానినిAsthenosphere అంటారు. Asthenosphere మీద తేలుతున్నట్టుగా భావించదగ్గ శిలావరణాన్ని, Tectonic Plates గా విభాగించారు.
దీన్ని కొంచెం వివరంగా అర్ధం చేసుకోవడం కోసం ఇంగ్లీష్ లో ఎర్త్ క్రస్ట్ వివరాలున్న బొమ్మను చూడవలసినదిగా మనవి.

Depending on how they are defined, there are usually seven or eight "major" plates: African, Antarctic, Eurasian, North American, South American, Pacific, and Indo-Australian. The latter is sometimes subdivided into the Indian and Australian plates.
There are dozens of smaller plates, the seven largest of which are the Arabian, Caribbean, Juan de Fuca, Cocos, Nazca, Philippine Sea and Scotia.
The current motion of the tectonic plates is today determined by remote sensing satellite data sets, calibrated with ground station measurements.

ఏ విధంగా వీటిని విభాజిస్తామో అన్నదాని బట్టి, నేటి శాస్త్రజ్ఞులు వీటిని 7 లేక 8 టెక్టోనిక్ ప్లేట్ ల గా విభజించారు. వీటి పై మరి కొన్ని చిన్న ప్లేట్ లను కూడా గుర్తించారు కానీ గమనించదగ్గ విషయమేమిటంటే, ఈ 7/8 అతి ముఖ్యమైన టెక్టోనిక్ ప్లేట్లు.
సనాతన శాస్త్రం, ఈ అష్టదిగ్గజాలు కదిలినపుడు భూకంపాలవంటివి వస్తుంటాయి అని చెబుతోంది. నేటి అభిప్రాయం కూడా అదే.

‘అష్ట దిగ్గజాలు’ ఆంటే, భూమిని ఎనిమిది దిక్కులా మోస్తున్న ఏనుగులు. నిజంగా ఏనుగులు మోస్తుంటాయా అని అడక్కండేఁ? భూమి మీద సంచరించే అతి పెద్ద జీవి ఏనుగు – అందుకని భౌగోళిక శక్తులను దానితో పోల్చాయి మన సనాతన శాస్త్రాలు.
ఆష్ట దిగ్గజాలు ఏవి? వాటి పేర్లేంటి? ఏవేవి ఏ దిక్కులో ఉంటాయి? దీనికి సమాధానం విష్ణుధర్మోత్తర పురాణం 50వ అధ్యాయంలో దొరుకుతుంది.
కుముదైరావణౌ పద్మం పుష్పదంతోఽథ వామనః – సుప్రతీకాఽoజనౌ నీల ఏతేఽష్టౌ దేవయోనయః ||
1. ఈశాన్యం (Northeast) – కుముదం
2. తూర్పు (East) – ఐరావతం
3. ఆగ్నేయం (Southeast) – పద్మం
4. దక్షిణం (South) – పుష్పదంతం
5. నైఋతి (Southwest) – వామనం
6. పశ్చిమం (West) – సుప్రతీకం
7. వాయవ్యం (Northwest) – అజనం
8. ఉత్తరం (West) – నీలం

ఈ Tectonic Platesలో ముఖ్యమైన పెద్దవి ఏన్ని? అవి ఏవి? ఈ విషయంలో ఏకాభిప్రాయం కనబడటంలేదు. కొందరేమో ఏడు అంటారు – కొందరు ఎనిమిది.
1. ఆఫ్రికా ఫలకం – African Plate
2. దక్షిణధ్రువ ఫలకం – Antarctic Plate
3. ఆస్ట్ఱేలియా ఫలకం – Australian Plate
4. ఐరోపా-ఏషియా ఫలకం – Eurasia Plate
5. భారత ఉపఖండ ఫలకం – Indian Plate
6. ఉత్తర అమెరికా ఫలకం – North American Plate
7. పసిఫిక్ ఫలకం – Pacific Plate
8. దక్షిణ అమెరికా ఫలకం – South American Plate
ఒకానొక విషయంలో సనాతన – ఆధునిక శాస్త్రాల మధ్య నాకు కనిపించిన సారూప్యాన్ని పదిమంది ముందుంచడమే ఈ ప్రయత్నం. సనాతన దర్మానికి ఇటువంటి నిరూపణల అవసరం లేదు.
మనం మన సనాతన ధర్మంలో చెప్పిన విషయాలను నేటి శాస్త్ర ఆవిష్కరణలతో సరిపోల్చుకుంటున్నాము. చూడండి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ లేకుండా మన ఋషులు ఇతిమిద్ధంగా వీటిని ఎంత నిక్కచ్చిగా కనుక్కున్నారో.
సంకేతార్ధంగా వారు చెప్పిన ఎన్నో విషయాల మీద మనం మరింత పరిశోధించ వలసిన అవసరం ఎంతైనా వుంది.

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

Friday, January 3, 2020

🕉️శివపూజతో ఎన్నో సమస్యలకు పరిహారాలు🕉️

🌷1. ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. ఎంత పేదరికం ఉన్నా త్వరలోనే శ్రీమంతులు అవుతారు.

🌷2. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి.

🌷3. ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి.

🌷4. తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాల వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి.

🌷5. తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి.

🌷6. అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి, అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది.

🕉️🙏శ్రీ మాత్రే నమః🙏🕉️
సేకరణ భానుమతి అక్కిశెట్టి వాల్ నుండి