Monday, February 17, 2020

పెళ్ళి కూతురు

*పెళ్లి లో కన్య ను గంప లో మేనమామ ఎందుకు తేవాలి*

వెదురు బుట్ట తయారుచేసి దానిలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని గౌరీ పూజ చేయిస్తారు. బుట్టలో కూర్చుని వివాహ వేదిక మీదకి రావడం కన్నా ముందే గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో కూర్చుంటుంది.

గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది.
సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు.
సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు.
అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి.
ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మియే కదా జీవుడికి!

 పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడది. ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది.
అందుకే ఆయన వృద్ధి కూడా దేనిమీద ఆధారపడుతుంది అంటే భార్య మీద ఆధారపడుతుంది.
ఆమెయే ఆతని లక్ష్మి.
అందుకే లక్ష్మి ఉండే అయిదు స్థానాలలో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం.
అక్కడ బొట్టు పెట్టుకు తీరాలి.
అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకు కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. లక్ష్మీ స్థానం అది.
ఆమె లక్ష్మియై నారాయణుడిని చేరుతోంది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది.

ఆమె ‘నిత్యానపాయినీ’.
ఆమె ఎన్నడూ విష్ణువును విడిచి పెట్టి ఉండదు.
శ్రీరమ సీత గాఁగ,నిజ సేవక బృందము వీరవైష్ణవా
చారజనంబు గాఁగ,
విరజానది గౌతమిగా,
వికుంఠము
న్నారయ భద్రశైలశిఖరాగ్రము గాఁగ వసించు చేతనో
ద్దారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ!కరుణాపయోనిధీ!
అని గోపరాజు గారు.

 శ్రీమహా విష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది.
ఆయన కృష్ణ భగవానునిగా వస్తే ఆమె రుక్మిణీ దేవిగా వస్తుంది. ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది. ఎన్నడూ విడిచిపెట్టదు.
అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది.

ఆడపిల్ల – ఆడ అంటే తెలుగులో అక్కడ.
అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది.
ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతుంది.

ఇక్కడ లక్ష్మి పుట్టింది.
అదృష్టం ఏమిటి? ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను.
ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను. ఎవరికి? లక్ష్మి ఎప్పుడూ నారాయణునికే చెందుతుంది.
అందుకే ఆమె లక్ష్మి గనుక పద్మంలో కూర్చోవాలి.

కాబట్టి వెదురు బుట్ట పద్మానికి సంకేతం.
ఎందుకు పద్మంలో కూర్చోవాలి? ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసిరావాలి. ఆయన వృద్ధిలోకి రావాలి. ఎన్నో యజ్ఞములు చేయాలి.

 ఎంతో ధార్మికంగా సంపాదించాలి.
ఆయనకి సంతానం కలగాలి.
ఆయన సంతోష పడిపోవాలి.
ఆయన తండ్రి కావాలి,
 తాత కావాలి.
ముత్తాత కావాలి.

ఆయనకు కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ ఋణం తీరాలి. తండ్రి ఋణం తాను సంతానాన్ని పొందితే తీరుతుంది.
ఆ సంతానం నానుండి రావాలి. ‘ధర్మ ప్రజాపత్యర్థం’ ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నానుండి సంతానం కలగాలి. ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే. నడిచి వెళ్ళకూడదు వేదికమీదకి. లక్ష్మి అంటేనే ఐశ్వర్యం.
 లక్ష్మిగా ఆమె వేదికమీదకి వెళ్తోంది నారాయణ మూర్తిని పొందడానికి. పద్మంలో వెళ్ళాలి.
అయ్యా నీ లక్ష్మిని తీసుకువస్తున్నాం.
ఈ ప్రేమ ఎవరిది? మా అక్కచెల్లెళ్ళది. మా అక్క చెల్లుళ్ళు కన్న బిడ్డ అని మేనమామలు పరమ పరవశంతో ఆమెను లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని వెడతారు.
తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు.
ఈమె నీ లక్ష్మి.
ఇద్దరూ ఒకటి అయిపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోవక్కరలేదు. నారాయణుడి ప్రక్కన లక్ష్మియే. అందుకు ఒకపీట మీదకి మారిపోతారు ఇద్దరూ.
మారేవరకు బుట్టలోనే కూర్చుంటుంది.
బుట్టలో కూర్చోబెట్టడం అనేది కేవలం మౌడ్యమైన విషయం కాదు. ఆయన ప్రక్కకి లక్ష్మి చేరుతోంది ఇప్పుడు సుసంపన్నుడు అవుతున్నాడు.
 అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెని బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకు వెళ్తారు.
మేనమామలు ప్రేమైక మూర్తులు.

లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం.
నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది.

నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు. లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు అని పరవశించి పోయేవాడు మగపిల్లవాడి తండ్రి.
 అందుకే అయ్యా మీరు ఇంత ఆదరభావంతో పిల్లను తెచ్చారు.
లక్ష్మీ దేవిని తెచ్చారు నారాయణుడు అని నా కొడుకుని చూసి.
మీరు పదికాలాలు బ్రతకండి అని ఆయుః కారకం కనుక అంచు ఉన్న పంచెల చాపు మేనమామలకి ఇస్తారు.
మేనమామలే ఎందుకు తేవాలి? తెలుగునాట ఒక లక్షణం ఉంది.
అక్క చెల్లెళ్ళకి ఆడపిల్ల పుడితే ఒరేయ్ నీకు భార్య పుట్టింది అంటారు. ఎన్నడూ నేను నా మేనకోడలిని ఆ దృష్టితో చూడలేదు. ఆమెను లక్ష్మిగానే చూశాను. నారాయణుడిని చేరుతుంది అనుకున్నాను.
భర్తృ  భావనతో చూడలేదు.

 పవిత్రభావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణుడి దగ్గరికి తెచ్చాను అని తెస్తాడు.
అది మేనమామ పవిత్ర హృదయానికి ఆవిష్కారం.

అందుకే పెళ్ళి కూతుర్ని బుట్టలో తేవడం మేనమామలు తెస్తే పెళ్ళి అయిపోయాక? నిజంగా వాళ్ళు ఐశ్వర్యవంతులు కాకపోయినా ఆమెని నడిపించి కానీ, ఇంకొకలా కానీ వెళ్ళకుండా ఊర్లో ఐశ్వర్యవంతులు ఎవరో వాళ్ళు తమ వాహనం ఇచ్చి పంపించాలి.

అధవా ఎద్దులబండిలో తీసుకు వెళ్తారు.
వాహనంలో వెళ్ళాలి తప్ప నడిచి వెళ్ళకూడదు.

ఆడపిల్లని అంత పెద్ద ఎత్తున గౌరవించి లక్ష్మిగా ఆహ్వానించినటువంటి జాతి మన జాతి.

                                 ఇట్లు
                                    మీ
                  అవధానుల శ్రీనివాస శాస్త్రి

పెళ్ళి కూతురు

*పెళ్లి లో కన్య ను గంప లో మేనమామ ఎందుకు తేవాలి*

వెదురు బుట్ట తయారుచేసి దానిలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని గౌరీ పూజ చేయిస్తారు. బుట్టలో కూర్చుని వివాహ వేదిక మీదకి రావడం కన్నా ముందే గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో కూర్చుంటుంది.

గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది.
సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు.
సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు.
అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి.
ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మియే కదా జీవుడికి!

 పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడది. ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది.
అందుకే ఆయన వృద్ధి కూడా దేనిమీద ఆధారపడుతుంది అంటే భార్య మీద ఆధారపడుతుంది.
ఆమెయే ఆతని లక్ష్మి.
అందుకే లక్ష్మి ఉండే అయిదు స్థానాలలో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం.
అక్కడ బొట్టు పెట్టుకు తీరాలి.
అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకు కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. లక్ష్మీ స్థానం అది.
ఆమె లక్ష్మియై నారాయణుడిని చేరుతోంది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది.

ఆమె ‘నిత్యానపాయినీ’.
ఆమె ఎన్నడూ విష్ణువును విడిచి పెట్టి ఉండదు.
శ్రీరమ సీత గాఁగ,నిజ సేవక బృందము వీరవైష్ణవా
చారజనంబు గాఁగ,
విరజానది గౌతమిగా,
వికుంఠము
న్నారయ భద్రశైలశిఖరాగ్రము గాఁగ వసించు చేతనో
ద్దారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ!కరుణాపయోనిధీ!
అని గోపరాజు గారు.

 శ్రీమహా విష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది.
ఆయన కృష్ణ భగవానునిగా వస్తే ఆమె రుక్మిణీ దేవిగా వస్తుంది. ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది. ఎన్నడూ విడిచిపెట్టదు.
అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది.

ఆడపిల్ల – ఆడ అంటే తెలుగులో అక్కడ.
అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది.
ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతుంది.

ఇక్కడ లక్ష్మి పుట్టింది.
అదృష్టం ఏమిటి? ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను.
ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను. ఎవరికి? లక్ష్మి ఎప్పుడూ నారాయణునికే చెందుతుంది.
అందుకే ఆమె లక్ష్మి గనుక పద్మంలో కూర్చోవాలి.

కాబట్టి వెదురు బుట్ట పద్మానికి సంకేతం.
ఎందుకు పద్మంలో కూర్చోవాలి? ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసిరావాలి. ఆయన వృద్ధిలోకి రావాలి. ఎన్నో యజ్ఞములు చేయాలి.

 ఎంతో ధార్మికంగా సంపాదించాలి.
ఆయనకి సంతానం కలగాలి.
ఆయన సంతోష పడిపోవాలి.
ఆయన తండ్రి కావాలి,
 తాత కావాలి.
ముత్తాత కావాలి.

ఆయనకు కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ ఋణం తీరాలి. తండ్రి ఋణం తాను సంతానాన్ని పొందితే తీరుతుంది.
ఆ సంతానం నానుండి రావాలి. ‘ధర్మ ప్రజాపత్యర్థం’ ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నానుండి సంతానం కలగాలి. ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే. నడిచి వెళ్ళకూడదు వేదికమీదకి. లక్ష్మి అంటేనే ఐశ్వర్యం.
 లక్ష్మిగా ఆమె వేదికమీదకి వెళ్తోంది నారాయణ మూర్తిని పొందడానికి. పద్మంలో వెళ్ళాలి.
అయ్యా నీ లక్ష్మిని తీసుకువస్తున్నాం.
ఈ ప్రేమ ఎవరిది? మా అక్కచెల్లెళ్ళది. మా అక్క చెల్లుళ్ళు కన్న బిడ్డ అని మేనమామలు పరమ పరవశంతో ఆమెను లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని వెడతారు.
తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు.
ఈమె నీ లక్ష్మి.
ఇద్దరూ ఒకటి అయిపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోవక్కరలేదు. నారాయణుడి ప్రక్కన లక్ష్మియే. అందుకు ఒకపీట మీదకి మారిపోతారు ఇద్దరూ.
మారేవరకు బుట్టలోనే కూర్చుంటుంది.
బుట్టలో కూర్చోబెట్టడం అనేది కేవలం మౌడ్యమైన విషయం కాదు. ఆయన ప్రక్కకి లక్ష్మి చేరుతోంది ఇప్పుడు సుసంపన్నుడు అవుతున్నాడు.
 అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెని బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకు వెళ్తారు.
మేనమామలు ప్రేమైక మూర్తులు.

లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం.
నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది.

నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు. లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు అని పరవశించి పోయేవాడు మగపిల్లవాడి తండ్రి.
 అందుకే అయ్యా మీరు ఇంత ఆదరభావంతో పిల్లను తెచ్చారు.
లక్ష్మీ దేవిని తెచ్చారు నారాయణుడు అని నా కొడుకుని చూసి.
మీరు పదికాలాలు బ్రతకండి అని ఆయుః కారకం కనుక అంచు ఉన్న పంచెల చాపు మేనమామలకి ఇస్తారు.
మేనమామలే ఎందుకు తేవాలి? తెలుగునాట ఒక లక్షణం ఉంది.
అక్క చెల్లెళ్ళకి ఆడపిల్ల పుడితే ఒరేయ్ నీకు భార్య పుట్టింది అంటారు. ఎన్నడూ నేను నా మేనకోడలిని ఆ దృష్టితో చూడలేదు. ఆమెను లక్ష్మిగానే చూశాను. నారాయణుడిని చేరుతుంది అనుకున్నాను.
భర్తృ  భావనతో చూడలేదు.

 పవిత్రభావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణుడి దగ్గరికి తెచ్చాను అని తెస్తాడు.
అది మేనమామ పవిత్ర హృదయానికి ఆవిష్కారం.

అందుకే పెళ్ళి కూతుర్ని బుట్టలో తేవడం మేనమామలు తెస్తే పెళ్ళి అయిపోయాక? నిజంగా వాళ్ళు ఐశ్వర్యవంతులు కాకపోయినా ఆమెని నడిపించి కానీ, ఇంకొకలా కానీ వెళ్ళకుండా ఊర్లో ఐశ్వర్యవంతులు ఎవరో వాళ్ళు తమ వాహనం ఇచ్చి పంపించాలి.

అధవా ఎద్దులబండిలో తీసుకు వెళ్తారు.
వాహనంలో వెళ్ళాలి తప్ప నడిచి వెళ్ళకూడదు.

ఆడపిల్లని అంత పెద్ద ఎత్తున గౌరవించి లక్ష్మిగా ఆహ్వానించినటువంటి జాతి మన జాతి.

                                 ఇట్లు
                                    మీ
                  అవధానుల శ్రీనివాస శాస్త్రి

Tuesday, February 11, 2020

రుద్రం

రుద్రాభిషేకం 🙏
“రుద్రం” (శివ స్వరూపము) - 1వ భాగము.
విశ్లేషణ - శాస్త్రి ఆత్రేయ (ఆకుండి శ్రీనివాస శాస్త్రి).

రుద్రం - లయం చేసేది / చీకట్లను నిర్మూలించేది / అజ్ఞానాన్ని తొలగించేది.

రుద్రానికి సంబంధించి ఎన్నో కర్మకాండలను, యజుర్వేదము తన మంత్రభాగంలో వివరించడం జరిగింది. అవి రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతిరుద్రంగా విభజించడం జరిగింది.

ఇందులో కర్మ భాగము :

యజుర్వేద మంత్రభాగంలో పేర్కొన్న పదకొండు అనువాకాలకి “రుద్రం” అని పేరు. దీనిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకాన్ని “రుద్రాభిషేకము” అంటారు. ఈ పదకొండు అనువాకాల రుద్రాన్ని పదకొండుసార్లు పఠిస్తూ చేసే అభిషేకానికి “ఏకాదశ రుద్రాభిషేకము” లేదా “రుద్రి” అంటారు.

రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకాన్ని లఘురుద్రాభిషేకమని, ఇటువంటి పదకొండు లఘురుద్రాభిషేకాలను మహారుద్రమని, ఈ మహారుద్రాలు పదకొండయితే అతిరుద్రమని చెప్పబడింది.

ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే రుద్రాభిషేకమని, వీటిని హోమంలో వినియోగిస్తే రుద్రయాగమని సూచించడం జరిగింది.

ఈ అభిషేక తీర్థాన్ని లేదా యాగ భస్మాన్ని జీవుడు భక్తితో గ్రహించటం ద్వారా, జీవాత్మను ఆశ్రయించి వున్న సమస్త దోషాలు తొలగిపోయి, జీవుడు పరమాత్మలో ఐక్యం చెందుతాడని చెప్పబడింది.

ఇందులో జ్ఞాన విభాగము :

“నారుద్రో రుద్రమర్చయేత్” అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడని చెప్పబడింది.

ఇది అంత సులభంగా సాధ్యపడదు. ఎంతో సాధన కావాలి. సాధనతో సత్యాన్ని గ్రహించాలి. సత్యమే ఆత్మగా గ్రహించాలి. తనలోనే సచ్చిదానంద స్వరూపునిగా విరాజిల్లే పరమశివుణ్ణి సర్వకాల, సర్వావస్థలయందు అనుభూతి పొందాలి. చివరికి “చిదానందరూపః శివోహమ్! శివోహమ్!” అన్న స్థితికి చేరుకోవాలి. అదే బ్రహ్మైక్య స్థితి. ఆ స్థితినే ఆదిశంకరులు తమ “ఆత్మషట్కము”లో ఎంతో సుళువుగా అభివర్ణించారు.

భక్తులకోసం రుద్రాభిషేక ఆచరణ :

అందుకనే మహనీయులు “మహాన్యాసము” అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు అందించేరు. అప్పటినుంచి ఈ మహాన్యాసము రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి ఆచారణలోకి వచ్చింది. మహాన్యాసము అంటే భక్తుడు రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేసే అధికారం పొందుటకు, వాటికి ముందు మహిమాన్వితుడైన రుద్రుని తన ఆత్మ యందు విశిష్టముగా నిలుపుకొనుటయే రౌద్రీకరణము. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును.

రుద్రములో నమకము, చమకము ఎంతో ముఖ్యమైనవి. “నమః”తో అంతమయ్యే శ్లోకాలు నమకము గాను, “చమే”తో అంతమయ్యే శ్లోకాలు చమకంగా చెప్పబడ్డాయి. నమకము రుద్రునికి భక్తుని ప్రార్థనగా, చమకము భక్తునికి రుద్రుని ఆశీర్వచనముగా చెప్పబడ్డాయి.

తదుపరి భాగాలలో నమకము, చమకము గురించి ప్రస్తావించుకుందాము.

శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 🙏

Monday, February 10, 2020

హనుమంతుడు

జయహో భక్త హనుమాన్‌
సప్త చిరంజీవులలో ఒకడు, శ్రీరాముడికి ప్రియ భక్తుడు. అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. అర్జునుని సఖుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటి మరీ లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకాన్ని హరించినవాడు.
ఔషధీ సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకు వచ్చి కదన రంగాన వివశుడై పడి ఉన్న లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వాన్ని అణచినవాడు అయిన వీర హనుమాన్‌ శక్తి యుక్తులను కీర్తించడం సాధ్యమా?
భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. మహాబలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఆయన్ని ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. వాయుదేవుడి వరప్రసాదంగా జన్మించాడు కనుక వాయుపుత్రుడని, పవన సుతుడనీ అంటారు. సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దేవుడు ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి పేర్లతో కూడా ఆరాధిస్తారు. సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకొచ్చిన హనుమంతుడు తాను స్వయంగా అంతులేని పరాక్రమవంతుడయ్యి కూడా శ్రీరాముని సేవలో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.
ఆయనకు శ్రీరాముడంటే ఎంతటి భక్తి ప్రపత్తులంటే తన మనసునే మందిరంగా చేసి మరీ వారిని ఆరాధించాడు. ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. కలౌ కపి వినాయకౌ అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు ... వినాయకుడు, హనుమంతుడు. అలాగే భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. శని గ్రహం అనుకూలంగా లేకపోతే వచ్చే బాధలూ తొలగిపోతాయి. బుద్ధి బలం పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది. ధైర్యం వస్తుంది. అందుకే హనుమజ్జయంతి పర్వ దినాన మరింత భక్తి శ్రద్ధలతో హనుమంతుని అర్చిస్తారు.
‘యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం బాష్ప వారి పరిపూర్ణలోచనం మారుతీం సమత రాక్షసాంతకం’  అంటే ఎక్కడ రామనామం వినిపిస్తూంటుందో అక్కడ కళ్లనిండా ఆనందబాష్పాలు నింపుకుని తలవంచి నమస్కరిస్తూ నిలబడి ఉంటాడట హనుమంతుడు. దీనిని బట్టి శ్రీరామ నామ జపం ఎక్కడ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు.
సూర్యాంజనేయం సూర్యాంజనేయం అంటే? సూర్యుడు, ఆంజనేయుడికి ఉన్న సంబంధం. అది మనం తెలుసుకోవలసిందే. వాల్మీకి రామాయణం, ఇతర పురాణాలు సూర్యుడికీ, హనుమంతుడికీ ఉన్న అనుబంధాన్ని సవివరంగా తెలియజేశాయి. హనుమంతునికి రాముని తర్వాత సూర్యునితో ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనబడదు. ఒకసారి ఉదయభానుడిని చూసి ఆకలిగా ఉన్న బాలాంజనేయుడు ఎర్రని సూర్యబింబాన్ని పండుగా భ్రమించి ఆరగించడానికి ఆకాశానికి ఎగిరితే ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైన సంగతి తెలిసిందే. దీని అర్థం ఏమిటంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుని ఆకర్షించటం వాళ్ల మొదటి అనుబంధం.
సూర్య శిష్యరికం బాల్యంలోనే గాక విద్యార్థి దశకు వచ్చాక కూడా హనుమంతుని దృష్టిని సూర్యుడు ఆకర్షించాడు. తనకు తగిన గురువు సూర్యుడేనని నిర్ణయించుకొని ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్లి నమస్కరించి విద్యను అర్థించాడు. నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులభం కాదని సూర్యుడు హనుమంతునికి నచ్చజెప్పటానికి చూశాడు. కాని చివరికి హనుమంతుడి విద్యా జిజ్ఞాసను అర్థం చేసుకొని శిష్యుడిగా అంగీకరించాడు.
సూర్యుని దగ్గర హనుమంతుడు విద్యను అభ్యసించేందుకు ఉదయాద్రిపై ఓ పాదం, అస్తాద్రిపై ఓ పాదం ఉంచి వేదవేదాంగాలు, ఆరు శాస్త్రాలు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, నాటకాలంకారాలు, 64 కళలు అభ్యసించాడు. సూర్యుని శిష్యరికం వల్లే శ్రీరాముని మొదటి సమాగమంలోనే తన సంభాషణా చాతుర్యంతో హనుమంతుడు ఆకర్షించగలిగాడు. మైనాకుని వినయంతో, సింహికను శక్తితో, సురసను యుక్తితో జయించగలగడం సూర్యుని దగ్గర నేర్చుకున్న 64 కళల ఫలితమే.
సూర్యపుత్రునికి స్నేహితుడు సూర్యభగవానుని శిష్యుడైన హనుమంతుడు సుగ్రీవునికి మంత్రిగా, మిత్రునిగా సలహాలను అందించాడు. వాలికి భయపడి దేశాలు పట్టి తిరిగిన కాలంలో సుగ్రీవునికి చేదోడు వాదోడుగా మెలిగాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవునికి, సూర్యవంశీయుడైన శ్రీరామునికి చెలిమి ఏర్పడటానికి కారకుడు ఆంజనేయుడే.వాల్మీకి రామాయణంలో హనుమంతుని వివాహం గురించి కాని, భార్య గురించి కాని ఎటువంటి ప్రస్తావనా లేదు. కొన్ని పురాణాల ప్రకారం సూర్యభగవానుని కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య.
అంటే సూర్యాంజనేయుల మధ్య మామా అల్లుళ్ళ సంబంధం కూడా ఉంది.హనుమంతుని ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడే. తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుని సేవించుకునే మహాభాగ్యం హనుమకి దక్కింది. శ్రీరామునితో పరిచయమైన నాటినుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు. సీతారాములను హృదయంలో నిలుపుకోవడం హనుమంతుని భక్తికి పరాకాష్ట. శ్రీరామభక్తులకు హనుమంతుడు సర్వదా సంరక్షకుడిగా ఉంటాడు.  – కృష్ణ కార్తీక
హనుమధ్యాన శ్లోకాలు ►హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో కొలిచిన వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.
►విద్యా ప్రాప్తికి పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్దోష వినాశన! సకల విద్యాం కురుమే దేవ రామదూత నమోస్తుతే!!
► ఉద్యోగ ప్రాప్తికి హనుమాన్‌ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే! ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!
►కార్య సాధనకు అసాధ్య సాధక స్వామిన్‌ అసాధ్యం తమకిమ్‌ వద! రామదూత కృపాం సింధో మమకార్యమ్‌ సాధయప్రభో!!
►ఆరోగ్యానికి ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా! ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!
►సంతాన ప్రాప్తికి పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్‌! సంతానం కురుమే దేవ రామదూత నమోస్తుతే!!
►వ్యాపారాభివృద్ధికి సర్వ కళ్యాణ దాతరమ్‌ సర్వాపత్‌ నివారకమ్‌! అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్‌!!
►వివాహ ప్రాప్తికి యోగి ధ్యే యాంఘ్రి పద్మాయ జగతాం పతయేనమః! వివాహం కురుమేదేవ రామదూత నమోస్తుతే!! ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు(.సేకరణ)
ఆంజనేయ. వరభీమ. రామదూత మంపాహే

దీని స్తుతి

🍁శ్రీ దీపలక్ష్మీస్తోత్రమ్ 🍁

దీపస్త్వమేవ జగతాం దయితా రుచిస్తే, దీర్ఘం తమః ప్రతినివృత్యమితం యువాభ్యామ్  స్తవ్యం స్తవప్రియమతః శరణోక్తివశ్యం స్తోతుం భవన్తమభిలష్యతి జన్తురేషః
దీపః పాపహరో నౄణాం దీప ఆపన్నివారకః దీపో విధత్తే సుకృతిం దీపస్సమ్పత్ప్రదాయకః
దేవానాం తుష్టిదో దీపః పితౄణాం ప్రీతిదాయకః దీపజ్యోతిః పరమ్బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః
దీపో హరతు మే పాపం సన్ధ్యాదీప నమోఽస్తు తే
ఫలశ్రుతిః యా స్త్రీ పతివ్రతా లోకే గృహే దీపం తు పూరయేత్
దీపప్రదక్షిణం కుర్యాత్ సా భవేద్వై సుమఙ్గలా
ఇతి శ్రీదీపలక్ష్మీస్తోత్రం సమ్పూర్ణమ్

  🌻సమస్తలోకాః సుఖినోభవంతు,శుభోదయ🌻

Tuesday, February 4, 2020

ఖగోళ శాస్త్రం

కీశే మహోపాధ్యాయ శ్రీ పటాని సమంత్ గారు.
పాశ్చాత్య విజ్ఞాన మేధస్సుకు ప్రభావితం కాకుండా పూర్తిగా స్వయంకృషితో విజ్ఞాన తృష్ణతో ఖగోళ శాస్త్ర రంగానికి తమ కృషి ఫలాలు అందించిన పటాని సమంత్ పూర్తిపేరు మహామహోపాధ్యాయ చంద్రశేఖర్ సింగ్ హరిచందన్ మహాపాత్ర సమంత్. ఈయన పటాని సమంత్ చంద్రశేఖర్ గా కూడా ప్రసిద్ధి చెందారు.
బాల్యం :-
ఈయన 13 డిసెంబర్ 1835 లొ అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ వైజాగపటం జిల్లాలో  ఖండాపర ప్రాంతంలో జన్మించారు. బాల్యం నుంచి విశ్వం, ఖగోళం, రాశులు మొదలైన అంసాల మిద ఆసక్తి పెంచుకొని సంస్కృతంలోని శాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేశారు. ప్రాచీనుల శస్త్రీయ పరిజ్ఞానాన్ని ఔపాశన పట్టారు. ఈయన జీవిత కాలంలో పాశ్చాత్య దేశాలలో ఖగోళ విజ్ఞాన పరిధిపెరుగుతున్నా, ఈయనకు ఏ మాత్రం తెలియడానికి అవకాశమూలేదు. ఆ ప్రభావానికి దరి చేరనేలేదు. అందుబాటులో ఉన్న సంస్కృత  భాషలోని సంప్రదాయ సిద్ధాంత గ్రంథాలనే అధ్యయనం చేసి, ప్రయోగశీలిగా రూపొందారు.
ఖగోళ పరిశోధనలు :-
కంటితో చూడలేని ధనూరాశిని అయిదారు శతాబ్దాల క్రితమే మన పూర్వీకులు కనిపెట్టగలిగారు. ధనూరాశినే కాదు. మిగిలిన పదకొండు రాశులను వారు ఏ శాస్త్రీయ పరిజ్ఞానంతో గుర్తించగలిగిందీ ఈ రోజున మనం తెలుసుకోలేకపోతున్నాం. రవి (సూర్యుడు) సప్తశ్వరుఢుడని చెబుతూ సూర్యకాంతి వేరురంగుల కలయిక అని వేలాది సంవత్సరాల ఏ విధంగా గుర్తించగలిగారు.ప్రపంచ ప్రఖ్యాత ఖగోల శాస్త్రవేత్త "నెకల్షన్ మెర్లే" జీవిత కాలానికి కొన్ని వందల సంవత్సరాల పూర్వమే శ్రీనాధకవి తన "కాశీ ఖండం"లో కాంతివేగాన్ని ఎలా చెప్పగలిగాడు? దానికి ఆయన కనిపెట్టలే;దు. తన కాలం నాటికి తెలిసిన శాస్త్రీయ జ్ఞానాన్ని ఆయన తన పధ్యాలలో అవసరార్థం వాడుకున్నారు. ఈ కోవలోనే పటాని సమంత్ ఖగోళ శాస్త్రానికి సంబంధించి చేసిన పరిశీలనలు, గణింపులకు మూలాధారాలేమిటో అంతుపట్టడం లేదు. ఖగోళ విజ్ఞానంలో దృగ్గోచరమయ్యే ఘటనాల విలువలు గణించడానికి ప్రధానంగా రెండు రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి భూకేంద్రసిథ్దాంతం , రెండవది సూర్యకేంద్రసిథ్దాంతం ఈ సిద్ధాంతాల ఆధారంగానే రోదసి మీద పరిశోధనలు, పరిశీలనలు గణింపులూ చేయవచును. ఖగోళంలో సంభవించే అపురూప సంఘటనల ఆధారంగా ఆయా గణింపులను, గణీంచిన విలువలను పరీక్షించి సరిచేసుకోవచ్చును. ఫక్తు సంప్రదాయ పండితుడైన పటాని సమంత్ 1874 లో జరుగబోయే శుక్ర గ్రహ సంక్రమణం (శుక్ర గ్రహం ప్రయాణ మార్గం - ట్రాన్సిల్ ఆఫ్ వీనస్) గూర్చి చాలా కాలం ముందుగానే ప్రకటించారు.
ఈయన పరిశీలనలకు జ్ఞాన ప్రపంచానికి కోపర్నికస్ తీసుకు వచ్చిన ఖగోళ శాస్త్ర విప్లవం గూర్చి పరిచయమే లేదు. అయినప్పటికీ 1874, డిసెంబరు 9 వ తేదీన శుక్ర గ్రహం సంక్రమణం ఈయన నిర్ధారించిన తేదీనే జరిగింది. ఎదిగీ ఎదగని ఆనాటి భారతీయ ఆధునిక ఖగోళ శాస్త్ర చరిత్రలో ఒక అధ్బుత పరిశోధనగా మిగిలి పోయింది. ఈ సంఘటన వ్య్వధి, సమయం ఆధారంగా భూమి - సూర్యుడి నడుమ దూరాన్ని గణన చేయతం ఎంతో ఆసక్తికరం. ఆనాడు దేశం లోని అనేకమందిని దిగ్భ్రాంతి పరిచిన ఆ సంఘటన బ్రిటిష్ పాలకులకు కూడా ఆసక్తిని కల్పించింది. ప్రభుత్వ అధ్వర్యంలో అబ్జర్వేటరీ సెంటర్లు ప్ర్రారంభమై పనిచేయడం ప్రారంభించేలా సమంత్ కృషి చేయగలిగాడు. అంతే కాదు, దేశంలో విద్యావంతులైన కొంతమంది జిజ్ఞానువులు, సంస్థానాధీశులు ఖగోళ శాస్త్రం మీద ఆసక్తి పెంచుకొని, ఈ దిశగా కృషి ప్రారంభించారు.
పటాని సమంత్ పరిశీలించి గణింపులు చేసి, నిర్ధారించిన ఖగోళ సంఘటన తిరిగి 2004 జూన్ 8 న జరిగింది. 1874 తర్వాత తిరిగి శుక్రగ్రహం సంక్రమణం జరిగింది. ఈయన 1874 నాటి శుక్రగ్రహ సంక్రమణమునకు సంబంధించిన పరిశీలనలు, గణీంపులు పాశ్చాత్య ఖగోళ శాస్త్రవేత్తలు చేసిన కృషికి ఏమాత్రం తీసిపోవు. విశ్వాంతరాళంలోని ఘటనా ఘటనలను తాము స్వయంగా తయారుచేసుకున్న పరికరాల సాయంతో, నైపుణ్యంతొ పరిశీలించారు. ఖగోళ రహస్యాలను ఛేదించడానికి అనేకానేక అంశాలను శోధించి తన జీవిత కాలాన్ని వ్యయపరచిన సమంత్ భవిషత్తరాల కోసం ఎన్నెన్నో అమూల్యమైన పరిశీలనలు, గణింపులు, నిర్దారణలు చేశారు. ఖగోళ శాస్త్ర అంశాలను అవిరామంగా శోధించి, పరిశోధించి, తమ కృషి యావత్తును సిద్ధాంతదర్పణ సంస్కృత గ్రంథంలో పొందుపరచారు. ఈ గ్రంథాన్ని ఒరియా లిపిలో తాళపత్రాల మీద రాయగా 1899 లో కలకత్తా యూనివర్సిటీ వారు ప్రచురించారు. ఈ గ్రంథం మొత్తం 2500 శ్లోకాలలో నిండి ఉంది.
సిద్ధాంత దర్పణం :-
సిద్ధాంత దర్పణలో ఖగోళ శాస్త్ర సంబంధమైన అనేక అద్భుత అంశాలు ఉన్నాయి. సూర్య, శుక్ర గ్రహాల బింబాల నిష్పత్తి 1:32 అని లెక్కించడం, పరమాద్భుతమేకాదు, విస్మయం కూడా ఇది 31 నిమిషాల 31 సెకన్లు అని లెక్కించడం మరింత గొప్ప విషయం. ఈయన రాసిన సిద్ధాంత దర్పన లోని అనేక ముఖ్యాంశాలను ఆంగ్లంలోనికి అరుణ్ కుమార్ ఉపాధ్యాయ అనువదించారు. అయినప్పటికీ పటాని సుమంత్ కృషి చరిత్ర గర్భంలోనే మిగిలిపోయింది. విశ్వాంతరాళంలో సంభవింపబోయే శుక్ర గ్రహ సంక్రమణం గురించి ఈయనకు ఎలా తెలిసిందో ఎవరూ ఊహించలేకపోయారు. స్వయంగా అధ్యయనం చేసి, గణించి, గుర్తించి పరిశీలనలు చేసి ఉండి ఉంటారని అందరూ భావిస్తారు.
అస్తమయం :-
ఖగోళశాస్త్ర విజ్ఞానంలో అనితర సాధ్యమైన కృషి చేసిన పటాని సుమంత్ 1904 లో మరణించాడు. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలలో మంత్ర రూపంలోనూ, శ్లోకాల రూపంలోనూ అనేకానేక వైజ్ఞానిక రహస్యాలు నిక్షిప్తమై ఉండేవి. ధృవుడు అనే కల్పిత పాత్రను సృష్టించి అతని తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై "ఆకాశంలో అత్యున్నత స్థానాన్ని పొందిన నీ చుట్టూ సప్తఋషులు 26000 సంవత్సరాల అంతరాలలో ప్రకక్షిణలు చేస్తూ ఉంటారు" అని వరమిచ్చినట్లుగా భాగవత రచనలో ఉంది. విష్ణువచ్చల యనంలో ఒక వలయం పూర్తి కావడానికి 26000 సంవత్సరాలు పడుతుందని భాగవత రచయితకు హ్గిపార్చస్ (ఈ విషయాన్ని క్రీ.పూ 143 లో కనుగొన్నాడు) కంటే ఎంతో ముందుగా తెలియడం చాచా ఆశ్చర్యకరమే. ఇదే తరహాలో పటాని సమంత్ డాక్టరేట్లు, డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టాలు లేకుండానే అద్వితీయ కృషిచేసి ఖగోళ శాస్త్ర పరిశోధనలు వెలువరించారు. ఈయన ఖగోళ శాస్త్రపరమైన కృషి చిరస్మరణీయం. ఈయన చేసిన అపూర్వ పరిశోధనా కృషిని గుర్తించిన మన కేంద్ర ప్రభుత్వం (తపాలా శాఖ) 2001, జూన్ 11 వ తేదీన చంద్రశెఖర సుమంత్ పేరుమీదుగా ఒక పోస్టేజి స్టాంపును విడుదల చేసింది.