Friday, October 11, 2024

బద్రీనాథ్

6/9/24 బద్రీనాథ్

బహూని సంపత్తి తీర్థాని, దివి భూమౌ, రసాతలేచ I

బదరీయ సదృశ్యం, తీర్థం నభూతో నభవిష్యతిII










 సర్సి నుండి ఈరోజు ప్రయాణం  బద్రీనాథ్. ఇక్కడి నుంచి బద్రీనాథ్ దూరం 223 కిలోమీటర్లు దాదాపుగా ఒక ఎనిమిది గంటలు పడుతుంది. 

కేదార్నాథ్ 3583 మీటర్ల ఎత్తులో ఉంటే బద్రీనాథ్ 3,100 మీటర్ల ఎత్తులో ఎత్తులో ఉంది

 సర్సి .పొద్దున్నే 6 గంటలకు అలా లేచాను లేచినటువంటి వారము 07:00 కల్లా రెడీ కారుకి ఫోన్ చేసాము అతను 7:30 కల్లా వచ్చారు వర్షం కూడా లేదు కొంత హెలికాఫ్టర్ కూడా ఈరోజు బయలుదేరడానికి అనుకూలంగానే ఉంది అందరం కూడా రూమ్ ఖాళీ చేసి సబ్సిడీ నుంచి బయలుదేరి బద్రీనాథ్ కి వెళ్తూ ఉన్నాం బద్రీనాథ్కు వెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కడైనా ఒక హోటల్లో టిఫిన్ చేసి వెళ్దాం అనేటువంటి ఆలోచనలు బయలుదేరము

సర్సినుండి గుప్త కాశి గుప్త కాశీ నుంచి రుద్ర ప్రయాగ వరకు మంచి అద్భుతమైనటువంటి రోడ్డు ఉంది. గుప్తా కాశి మరియు ఆగస్త్యముని మధ్యలో నాలుగు లైన్లు దారి చాలా వేగంగా ప్రయాణం జరిగింది. అగస్త్యముని ఒక అద్భుతమైనటువంటి దేశం.ముని  పేరు మీద ఈ ప్రాంతం ఉంది. ఆయన తపస్సు చేసిన  ప్రాంతం. ఇక్కడ మనకు గంగా నది ఊరు మధ్యలో ప్రవహిస్తూ ఉంది ఒక గోడమీద చక్కనైనటువంటి అగస్త్యుడుయొక్క చిత్రం కూడా ఉంది. గుడి ఉంది.  రుద్రప్రయోగం వరకు ప్రయాణం ఇదంతా కొండ దిగటం ఈ ప్రయాణం చాలా ప్రశాంతంగా హాయిగా సాఫీగా జరిగింది అక్కడి నుంచి నంద ప్రయాగ దగ్గర రోడ్డు మూసివేశారు. అట్నుంచి ఈ ప్రయాణం జరగటం లేదు వేరే మార్గంలో మా  ప్రయాణం మొదలైంది.  గుప్తేశ్వర మీదుగా ప్రయాణం సాగింది చాలా ఎరుకైనటువంటి సన్నగా అయినటువంటి దారి మధ్యలో వర్షం కూడా పడింది అటు ఇటు రోడ్డుకి చీడ్ చెట్లు మాతో పాటుగా వస్తూనే ఉన్నాయి. చాలా ఇరుకైనటువంటి మార్గము రోడ్డు కూడా చాలా అస్సలు బాగోలేదు మధ్య మధ్యలో చాలా చోట్ల పడిపోయి ఉన్నాం. ఏదురు నుంచి మరొక కారు వస్తుంటే మనం వెనక్కి వెళ్లి వారికి దారి తీయాల్సినంత ఇరుకైనటువంటి ప్రాంతంరుద్రప్రయాగ దగ్గర నది ఒడ్డున టీ తాగాము. . ఇక్కడి నుండి కొండ ఎక్కాలి.


రుద్ర ప్రయాగం నుంచి నంద ప్రయాగం వైపు వెళ్లకుండా గోపేశ్వర్ మీదుగా మమ్మల్ని పిప్పిల్ కోట్ కు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతానికి తీసుకొని వెళ్లారు విరామం లేకుండా టిఫిన్ కోసం కూడా మధ్యలో ఎక్కడ ఆపలేదు. పిప్పిల్ కోట్ సురక్షిత ప్రాంతం ఇక్కడి నుండి  దారి బాగుంది అన్నాడు మా శర్మ డ్రైవర్.   అందమైనటువంటి పర్వతాలు.జాలువారె జలపాతాలు భాగీరదిలో కలుస్తున్నాయి.  ఇక్కడ కొండల మీద వ్యవసాయం కనిపించింది కొండలకు పచ్చల హారం గావరుసగా గట్ల కట్టి కమతాలలో వ్యవసాయం చేస్తున్నారు. వరి బాగా పండుతుంది పచ్చడైనటువంటి పొలం బంగారపు రంగులో  కంకులతోమెరిసిపోతూ ఉంది జలపాతాలకి లెక్కే లేదు నీటికి కొదవలేని కారణంగా కొండల మీద వ్యవసాయం చేస్తూ ఉన్నారు. చాలా ఎక్కువైనటువంటి వ్యవసాయములు ఈ ప్రాంతంలో బాగా కనిపించాయి ఊర్లో మధ్యలో నుంచి వెళుతున్నటువంటి ప్రదేశం ఎత్తేనటువంటి కొండ ఎక్కటం మద్య మధ్యలో వర్షం పడుతుంది వర్షం మరలా ఎండ ఇలా ఈ వాతావరణంలో అక్కడ ప్రయాణం చేయడం జరిగింది మధ్యలో మేఘాలలో నుంచి కూడా.

 మేఘాలు దాటి ముందుకు వెళ్లడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం కాకపోతే ఇరుకైనటువంటి దారి.దారి తప్పామేమో అని గూగుల్ మ్యాప్ పెట్టారు. ఫుల్ సిగ్నల్. ఇక్కడ ఊరు బయట వ్యాయామం చేసుకునేందుకు పార్కు లో ఏర్పాట్లు కనిపంచాయి. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చక్కటి ఏర్పాటు బాగుంది. చాలా గ్రామాల్లో ఇలా కనిపించింది. ఫోన్ సిగ్నల్ బాగుంది. అందరూ ఫోన్లు మాట్లాడుతూ నడుస్తున్నారు. బదరీనాద్ వరకూ మ్యాప్ చక్కగా పనిచేసింది.  టిఫిన్ చేసిన తర్వాత అక్కడిచి రెండున్నరకి  పిప్ల్కోట్  జోషిమఠ్ కు ప్రయాణం. దారి చాలా బాగుంది. విశాలమైన రోడ్డు అయినప్పటికీని మధ్య మధ్యలో రోడ్డు  అలకనంద నదిలోకి పడిపోవడం జరిగింది ఆప్రాంతం  ఇరుకుగా ఉంది చాలా ఎక్కువ చోట్ల ఇక్కడ రోడ్డు పడిపోయింది ఇక్కడి నుంచి ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతోంది .గుప్త కాశీ నుండి రుద్ర ప్రయాగ వరకు మనము కొండ కిందకు దిగటం. అక్కడి నుండి బాగా ఎత్తు కు ప్రయాణం. జోషిమఠ్ నుంచి బదరీనాద్ వరకూ అధ్భుతంగా ఉంది ప్రయాణం. విశాలమైన దారి .పడినచోట ఇరుకు. కొండ అంచుల కిందనుంచి మలుపులు తిరుగుతూ ఉంది .పక్కనే అలనంద ప్రవాహం అగాధమంత లోతుగా. జాలువారె జలపాతం కొండమీద నుండి పడే నీటి కింద నుంచి వెళ్ళాలి. బలే ఉంటుంది ప్రయాణం భయం ఉండదు. ఉత్సాహం పెంచుతుంది. డ్రైవర్ మాత్రం మహా జాగ్రత్తగా గమనిస్తూ నడుపుతున్న ా డు. బద్రీనాథ్ ముందు పూర్తిగా పడిపోయిన ప్రాంతంలో నిదానంగా వెళ్ళాల్సివచ్చింది. అక్కడ రెండు రోజులు మరమ్మతులు జరిగాయన్నారు. .  ఆమలుపు తిరుగగనే అద్భుతమైనటువంటి   బద్రీనాథ్  పుణ్య క్షేత్రం  ఊరి మధ్యలో కొత్తగా నిర్మాణాలు జరుగుతున్నాయి అక్కడి నుంచి జాగ్రత్తగా ఇంతకుముందు మేమున్నటువంటి ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లాం. అంటే గుడికి దగ్గరగా రూమ్సుకున్నాము .బాగా చల్లగా ఉంది దిగే సమయానికి అందరికన్నా ముందు గా నే నాలుగు గంటలకు వచ్చాము ఇంకా ప్రయాణికులు యొక్క రద్దీ మొదలు లేదు నాలుగు గంటలకు దగ్గరలో ఉన్నటువంటి రూము నుంచి నేను ఒక్కడినే బద్రీనాథ్ ఆలయానికి బయలుదేరా. ఇంతకుముందు చూసిన ప్రాంతం మరలా గుర్తుంటుందా లేదా అనేటువంటి ఒక ఆలోచనతో అదే ప్రాంతంలో చూస్తూ  ఏవిధమైనటువంటి మార్పులు లేవు ఎవరిని అడక్కుండానే వెళ్లి అలకనంద తీరంచేరా. ఎదురు గా దివ్య ధామం. అధ్భుతంగా ఉంటుంది దృశ్యం. నేను నది కి ఎడమవైపు .మధ్యలో నది ఎదురు గా కుడి వైపు నారాయణ పర్వతం పె చూపుకు ఎదురు గా ఆలయం. మరెక్కడా ఈవిధమైన ఆలయబాహ్య కుడ్యం  కనిపించదు రంగు రంగు లతో మధ్యలో మరీ ఎత్తుగా ఉండని గోపురం .ఒక పెద్ద గంట ద మొట్లు ఎక్కుతూ గంట కిందుగా ఆలయంలోకి ప్రవేశం. గంట అంది అందని ఎత్తు. ఎగిరి కొట్టాలి. అందిందా ఠంగ్ అంటూ మోగిపోతుంది ఒక్కసారే.   కొత్తగా జరిగినటువంటి మార్పు రెండవదివంతెన కూడా వచ్చింది. జనాలు ఎక్కువగా లేని కారణం గా నేను మొదటి వంతెన బద్రీనాథ్ ఆలయానికి చేరుకున్నాను అలకనందనలు దాటి అక్కడ నుంచి ముందుగా తప్తకుండా  నికి వెళ్లి అక్కడ ఆ కాళ్లు కడుక్కుని పైకి బద్రీనాథ్ ఆలయం వెళ్ళా. రద్దీ లేదు స్వామివారి దర్శనానికి వెళ్లాను లోపల ఒక భోగ్  (విశేషమైనసేవ) విశేషమైన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది . ఆలయం బయట నుంచి ఒక మంచె మీద నుంచి స్వామివారిని దర్శించేటువంటి వరుస ఉంది స్వామివారి దర్శనం చేసుకున్నాను అద్భుతమైనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో చాలా చక్కనైనటువంటి నారాయణ యొక్క దర్శనం జరిగింది 

అక్కడి నుంచి కిందకు వచ్చి పక్కనే ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క గుడిలో అమ్మవారి దర్శనం చేసుకుని వెనక జరుగుతూ ఉన్నటువంటి సత్సంగంలో కూర్చుని జరుగుతున్నటువంటి బద్రీనాథ్ యొక్క వైశ్యాన్ని తెలుపుతూ ఉన్నటువంటి హిందీలో జరుగుతున్న ప్రసంగం అప్పుడే మరల స్వామి వారి యొక్క అంతరాలయ దర్శనం జరుగుతోంది.స్వామివారి దర్శనం చేసుకున్నాను బదరీనాథుని ప్రక్కనే నారద విగ్రహము, నర నారాయణుల విగ్రహాలు, కుబేరుని విగ్రహము, ఉద్దవ, గరుడ విగ్రహములు, సుదర్శనుల వారి విగ్రహములుదర్శనంచేసుకుని


 4 గంటల ప్రాంతంలో గుడికి వెళ్లి 4:30 దాకా గుడిలో కూర్చున్నాను మరలా ఆలయంలో అంతరాలయంలో దర్శనం చేసుకుని బయటకు వచ్చాను ఆరు గంటలకు హారతి కార్యక్రమం మొదలవుతుంది అనేటువంటి విషయం తెలిసింది ఏమో వెంటనే తీసుకొని వస్తా నేను ఇద్దరం కలిసి ఉషా నేను ఇద్దరం కలిసి రూమ్ కి వచ్చాము రూమ్ నుంచి దేవాలయానికి బయలుదేరి వచ్చాము చాలా ఉత్సాహంగా బద్రీనాథ్ ఆలయానికి వచ్చే సమయానికి అప్పుడే భక్తులు రద్దీ కొంచెం పెరుగుతుంది అయినా మేము రెండో వంతెనమీద నుంచి గుడిలోకి వస్తూ  మధ్యలో ఉన్నటువంటి కేదారనాథ్ ఆలయాన్ని ఆ పక్కనే ఉన్నటువంటి శంకరాచార్య ఆలయాన్ని చూసి గుడిలోకి ప్రవేశించాము మేము వెళ్లే సమయానికి హారతికి పెద్ద వరుస ఉంది మేం కూడా వరుసలోని హారతికి లోపలికి వెళ్ళాము అంతరాలయం కాకుండా బయట ఉన్నటువంటి ఆలయానికి బయట వైపు ఉన్నటువంటి ఒక చిన్న ఎత్తైనటువంటి మంచి మీదుగా స్వామిని చూసి కిందకు వెళ్లాలి హారతి జరుగుతోంది మేము వెళ్లే సమయానికి అదృష్టవశాత్తు హారతి దేవుడికి ఇచ్చేటువంటి సందర్భంలో ఆపారు అంటే హారతి చివరికి వచ్చింది హారతి అయిన దాకా ఒక ఐదు నిమిషాలు హారతి అంతా చూసి అక్కడ నుంచి మరల తిరిగి ఎదురుగా ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళాము ఆ లక్ష్మీదేవి ఆలయానికి లోపల నుంచి హారతి తీసుకుని అమ్మవారికి ఇవ్వటం కోసం తీసుకున్న వచ్చారు అక్కడ హారతి తీసుకొని అక్కడి నుంచి వెన ఆలయమంతా భక్తులతో బాగా కోలాహలంగా ఉంది ఆలయం వెనుక భాగంలో చాలామంది భజన చేస్తున్నారు భక్తి తన్మయత్వంతో అద్భుతమైనటువంటి సాంప్రదాయాలు చాలా భజన జరుగుతోంది కొంచెం సేపు అక్కడే కూర్చుని భజన అయిన తర్వాత అక్కడే విష్ణు సహస్రనామ పారాయణ చేసింది విష్ణు సహస్రనామ పారాయణ తర్వాత అక్కడి నుంచి ఈ పక్కనే ఉన్నటువంటి ఆంజనేయమూర్తిని ఆంజనేయ మూర్తి పక్కనే ఉన్నటువంటి వినాయక స్వామిని ఆ పక్కనే ఉన్నటువంటి బద్రీనాథ్ ఆలయ క్షేత్రపాలకుడు అయినటువంటి ఘంటా కరుణి ఆలయాన్ని చూసి అక్కడ నుంచి తిరిగి బద్రీనాథ్ ఆలయం ముందుకు వచ్చాము.

 బద్రీనాథ్ ఆలయం ముందు భక్తులది బాగా పెరిగింది అని చాలామంది చాలామంది ఫోటోలు తీసుకుంటూ ఆలయం అంతా ఆలయం ముందు భాగం అంతా రెడీగా ఉంది. ఆలయం ముందు భాగంలో అప్పుడే లైట్లు వేయటం చేత ఆలయం అద్భుతంగా వెలిగిపోతోంది ఆలయాన్ని చూస్తూ అక్కడే కొన్ని ఫోటోలు తీసుకున్నాము. ఎదురుగా అలకనంద అనేది యొక్క సభలో వినిపిస్తూనే ఉన్నాయి తిరిగి అక్కడి నుంచి రూమ్ వైపుగా బయలుదేరి వెళ్ళాము రూముకి వెళ్తున్న సందర్భంలో అలకనంద నదిని దాటిన తరువాత అక్కడే గవర్నమెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో రుద్రాక్ష స్టోర్ కనిపించింది అక్కడ రుద్రాక్షలు రుద్రాక్ష మాలలు తీసుకుని అక్కడి నుంచి తిరిగి రూమ్ కి బయలుదేరాము ఆ రోజుకి భోజనం చేసేటువంటి ఆసక్తి లేకపోవడంతో అక్కడే బద్రీనాథ్లో లభించే అటువంటి అద్భుతమైనటువంటి రుజువుండేటువంటి పాలు ఉన్నాయి వాటిని తాగి అక్కడ నుంచి మేము చేరుకున్నాము మధ్యలో మధ్యలో పూజకు అవసరమైనటువంటి ఒక దావులను కూడా తీసుకున్నాను అక్కడి నుంచి తిరిగి రూమ్ కి వెళ్ళాము బాగా ఎక్కువైనటువంటి చలి పెరిగింది రాత్రి 8 గంటలకు ఉదృతంగా ఉంది దాదాపు పది సీడ్స్ లో మనకు మరలా తిరిగి స్వామివారి దర్శనానికి వెళ్దామని ఉద్దేశంతోనే రూమ్ కి వెళ్ళాను కానీ మరణం నుంచి బయటికి రాలేదు 8:30 ఆరోజు రాత్రి అక్కడే పడుకోవడం జరిగింది .

బధ్రీనాధ్ చామోళీ జిల్లాలో నగరపంచాయితీ. మరియు చార్ ధామ్ నాలుగింటిలో ద్వారక, పూరీ మరియు రామేశ్వరంలతో పాటునాలుగవది.

ఆదిశంకరులు భారతదేశములో  నాలుగు దిశలయందును నాలుగు పీఠములు స్థాపించారు. వాటి లో ఉత్తరాన బదరీనాద్   ఒకటి. జోషిమఠ్ లో శంకరాచార్య భఠం ఉంది. ఆరు నెలలు బదరీనాద్ లో మఠం ఉంటుంది. గుడి కి ఎదురు గా మఠం

బదరీ క్షేత్రానికి నాలుగు పేర్లు. అవి 1. కృతయుగములో  "ముక్తిపదము" , త్రే తాయుగమునందు "యోగసిద్ది" అని, 3. ద్వాపర యుగమున "త్రి విశాల్" అని, కలియుగమున "బదరికాశ్రమము" అని

బదరీనాధ్ నారాయణనీలకంఠ తదితర మహాపర్వతములకు ముఖద్వారము వంటిది. బదరీనాధ్ ఆలయము నగరము మధ్యభాగములో ముఖ్యఆకర్షణగా ఉంటుంది,బదరీనాథ్ క్షేత్రములో తప్త కుండము ఒడ్డున శివుడు ఆదికేదార్ శివలింగ రూపములో గుడి ఉంది. కొంత ముందుకు వెళితే ఆదిశంకరుల గుడి.

బ్రహ్మకపాల ఘాట్ బదరీనాధ్ ఆలయమునకు ఉత్తరముగా సుమారు 300 మీటర్ల దూరములో అలకనంద నదిఒడ్డుననున్నది. ఇచ్చటికి తేలికగా నడుచుకొని వెళ్లవచ్చును. బ్రహ్మకపాల్ ఘాట్ హిందువులకు అతి పవిత్రమైనస్థలము. ఇచట కల నారద, నరసింహ, వారాహ్, గరుఢ మరియు మార్కండేయ పేరులతో అయిదు గండశిలలకు ప్రపంచవ్యాప్తముగా ప్రాధాయతఉన్నది. ఇచటగల నల్లటిరాయి బ్రహ్మదేమునితలగా భావించబడుచున్నది.

సరస్వతీ నది ఇక్కడి కి సమీపంలో మానా గ్రామంలో కనిపిస్తుంది. కేవలం 300మీటర్ల ప్రవహించి అలకనంద లో కలుస్తుంది. ఇక్కడ మాత్రమే సరస్వతీ నది చూడగలం. చాలా ఒరవడి గా దుముకుతుంది.

మానా గ్రామము, వసుధారా జలపాతం, నరనారాయణుల ఆలయము, సూర్యకుండం, గణేశ్ గుహ, వ్యాసగుహ భీమాపూల్


బద్రీనాథ్ ఒక అద్భుతమైనటువంటి గుడి అలకనంద నదికి పక్కనే ఉంటుంది చిన్న కొండమీద మనకు బయట అద్భుతమైనటువంటి ఆలయ ముఖ ద్వారం కనిపిస్తూ ఉంటుంది ఒక పెద్ద గంట కింద నుంచి రెండు విభాగాలుగా మనకు ఆలయం కనిపిస్తూ ఉంటుంది నారాయణ పర్వతం మీద ఈ యొక్క ఆలయం కనిపిస్తూ ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి ఆలయం నలగనందనలు అడిగి ఎడమవైపున ఉన్నటువంటి లోయ మొత్తము దుకాణాలు ధర్మశాలలు లాడ్జీలతో మన ప్రయాణం చేయడానికి అనుకూగా అని ప్రయాణం చేసినటువంటి వారు వచ్చి ఈ విశ్రమించేటటువంటి ప్రాంతం దారి నుంచి ఎలక నిండా నదిని దాటి కుడివైపునటువంటి చిన్న కొండమీదకి వెళితే నారాయణ పర్వతం మీదకు వెళ్తే మనకు అక్కడ ముందు వైపు కూడా బద్రీనాథ్లో అద్భుతమైనటువంటి బద్రీనాథ్ యొక్క ఆలయ దర్శన కనిపిస్తూ ఉంటుంది దానికి ముందు వైపుగా తప్పకుండా అంటే వేడి నీళ్లతో కూడినటువంటి గుండాలు ఉంటాయి వాటిలో స్నానం చేయవచ్చు అక్కడినుంచి ఎక్కడి నుంచి ఈ పక్కనే ఉన్నటువంటి కేదారేశ్వర నీ గుడి మీదుగా బద్రీనాథ్ ఆలయంలోనికి వెళ్లవచ్చు చాలా అద్భుతమైనటువంటి ఆలయం ఆలయంలో మనకు విష్ణుమూర్తి విగ్రహం పెనమపత్ర నారాయణని ఇద్దరు కూర్చుని ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నాయి బద్రీనాథ్ కి కుడివైపున మనకు కుబేర మూర్తి విగ్రహం ఉంటుంది గణేష్ విగ్రహం ఉన్న ఐదు విగ్రహాలు లోపల ఈ సముదాయం మొత్తానికి పంచాయతీని పూజారి చెప్పారు స్వామివారి విగ్రహానికి వెనుకవైపుగా అంటే లక్ష్మీదేవి కుడివైపు భుజానికి విగ్రహాలు కూడా కనిపిస్తున్నది మహాభారత యుద్ధంలో తరువాత ఉద్దోడిని పిలిచి తాతని బెదిరి వెళ్ళమని స్వామి చెప్పినటువంటి కథ మనకు గుర్తుంటుంది నేల మీద పాలకులు కూడా ఉంటాయి పక్కనే నారద మహర్షి విగ్రహాలు ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి ఈ ఆలయాన్ని ఆలయ సందర్శన చాలా బాగుంటుంది ఆలయం పక్కనే మనకు లక్ష్మీదేవి యొక్క ఒక మందిరం చిన్న మందిరం ఉంది దాని పక్కన భోగమండపని స్వామివారికి దీనినే బోగు మండపని అంటారు ఇక్కడ స్వామివారికి నైవేద్యాలు తయారు చేసేసారు నర నారాయణరావు తపస్సు చేసే ప్రాంతంలో లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చి మొదటి రూపంలో ఆయనకు నిడని కల్పించడమే గాక దారుణ స్వయంగా వంట చేసే ఆయనకు భోజనం పెట్టేది ఆదోని ఇక్కడ సాక్షాత్తు లక్ష్మీదేవి తయారు చేసిన వంటకాన్ని ప్రకటించబడుతూ ఉంటాయి ఆన్లైన్లో అక్కడ మధ్యాహ్నం సమయంలో ఒక ప్రసాదం కూడా ఇస్తారు ఇంతకుముందు వచ్చిన సందర్భంలో మేము ఇక్కడ లక్ష్మీ అమ్మవారి యొక్క అన్న ప్రసాదాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఈ రోజు సాయంకాలం అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకున్నాము. ఆలయం పక్క నుంచి ఏ పక్కన ఆంజనేయస్వామి విగ్రహం ఆలయం వెనుక భాగంలో ఆ పక్కనే ఉన్నటువంటి వినాయకుని దర్శించి కంఠాకరుడు అనేటువంటి మన ఆలయ సేవకులుగా చెప్పినటువంటి ఘంటా కరుణలు కూడా చూసాము గంటా ఆలయం చూసిన తర్వాత అక్కడ నుంచి మనం తిరిగి బయటికి వస్తాం

No comments:

Post a Comment