8/9/24 నుండి 10/9/24
కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ
జయజయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో
8/9/24
నగరసు నుంచి హరిద్వార్ కు ప్రయాణం. బదరీనాద్ నుండి హరిద్వార్ 322 కి మీ
బదరీనాద్ నుండి నగరసు 133 కి మీ 4 30 గం ప్రయాణం కానీ ట్రాఫిక్ జామ్ తో 6.30 గంట పట్టింది. ఈ రోజు 190 కి మీ ప్రయాణం 5.గం సుమారు గా
నగరసు లో 8 .30 బయలుదేరాం టిఫిన్ చేసి. టిఫిన్ పోహ
ఈరోజు మొత్తం ప్రయాణంలో 9వ రోజు ప్రయాణం చాలా ప్రశాంతంగా సాగింది అంతా దారి లో విధమైనటువంటి రద్దీ లేదు చాలా ప్రశాంతంగా మధ్యాహ్నం 12.30 గంటలకు రిషీకేష్ చేరాము ఎక్కడా దిగలేదు హరిద్వార్ కి ప్రాచీన రామ మందిరంలో ఆశ్రమం కి వెళ్ళాము మధ్యాహ్నం 1:30 కల్లా నేను ఏ ప్రదేశం లో అయితే బయలుదేరాము అదే ప్రదేశానికి రాముల వారి గుడి దగ్గరికి ప్రాంతాన్ని చేరుకున్నాము చాలా ప్రశాంతంగా హాయిగా ఆనందం గా జరిగింది.స్వామి కి నమస్కరించి అక్కడే రూమ్ తీసుకొని భోజనం చేసాము. ఇక ఆరోజు విశ్రాంతి. సాయంకాలం నాలుగు గంటలకి హరికి పౌరీ వెళ్ళాము . ఆ పక్కనే బ్రహ్మాండమైనటువంటి అలంకరణ,పూజా సామాగ్రి దొరికేటువంటి ప్రదేశం మొత్తం తిరిగేము అక్కడ కొన్ని అలంకరణ వస్తువులను తీసుకున్నాం రాజాకి కొత్త ఇంటికి అలంకరణ సామాగ్రి అందమైనటువంటి వస్తువులను తీసుకొన్నాము.ఇక్కడ కొన్ని వస్తువులు మరెక్కడా దొరకవు. మంచి మన్నిక. ధర తక్కువ. ఆన్లైన్ లో కూడా కనిపించవు కొన్ని వస్తువులు. షాపింగ్ అయింది. హరికి పౌరి లో దర్శనానికి వెళ్ళాము సాయంకాలం హారతులు అయిన తర్వాతరూమ్ కి వచ్చాము. ఇలా హరిద్వార్ 9వ యాత్ర జరిగింది. మేము యాత్ర లో ఒకరోజు అదనంగా పెట్టుకున్నాము .మధ్యలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటాయని. అదృష్టం దేవుని అనుగ్రహముతో శుభకరం గా సుఖకరంగా యాత్ర జరిగింది. మరుసటి రోజు కూడా హరిద్వార్ లోనే మకాం. ఎక్కడికీ వెల్లలేదు .ఉదయాన్నే గంగా స్నానం. సాయంకాలం హారతి. రాజా ఆరోజు మధ్యాహ్నం హరిద్వార్ నుంచి బయలుదేరి డెహ్రాడూన్ వెళ్ళాడు .తనకి మరుసటి రోజు హైదరాబాద్ కి విమానం. మేము ఆరోజు అక్కడే ఉండి మరల హరిద్వార్ లో రంగా స్నానం చేసి అక్కడి నుంచి ఇంటికి తీసుకుని రావటానికి గంగా జలాన్ని తీసుకున్నాను అక్కడి నుంచి ఆరోజు విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు అంటే 10/9/24 తారీకు ఉదయాన్నే ఆరు గంటలకి ఢిల్లీ బయలుదేరి వచ్చాం. ఢిల్లీలో 11:30 కల్లా ఢిల్లీ చేరాము మరలా తిరిగి మా ట్రైన్ 4 గంటలకు ఢిల్లీలోని స్టేషన్లో విశ్రాంతి తీసుకున్నాము. నాలుగంటలకి GT Express లో బయలుదేరి చీరాల ప్రయాణం. మధ్యలో ట్రైన్ డైవర్షన్ జరిగింది. వర్షం . ప వర్షాల కారణంచేత ట్రైను డైవర్ట్ అయింది నిన్న సరే ట్రైన్ ఒక మూడు గంటలు ఆలస్యంగా తిరిగి 11వ తారీకు అర్ధరాత్రి అంటే 12వ తారీకు తెల్లవారుజామున మూడు గంటలకు ఇంటికి వచ్చాం.ఆ సమయానికి మూడున్నర అయింది పాపాయి రిషిత్ మామయ్య గారు ఉన్నారు. కాళ్ళు కడిగిహారతి ఇచ్చి ఇంట్లో కి తీసుకువెళ్ళారు. కొంచం సేపు మీటింగ్ . హాయిగా ఇంట్లోనే నిద్రపోయాము ఎలా బయలుదేరాము అలా ఇంటికి చేరాం. ప్రశాంతంగా యాత్ర అంతా జరిగింది దేవునిదయ.
యాత్ర కు బయలుదేరింది
29/8/24బాపట్ల నుండి గుంటూరు. గుంటూరు నుండి జన్మభూమి లో హైదరాబాద్.
30/8/24.హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ విమాన ప్రయాణం(మొదటి సారి)9 .00 to 11.30.
31/8/24 హరిద్వార్ నుండి జానకీ చట్టీ
1/9/24 జానకీ చట్టి నుండి ధరళీ
2/8/24 ధరళీ నుండి గంగోత్రి.
గంగోత్రి నుండి ఘర్సాలి
3/9/24 ఘర్సాలి నుండి సర్సీ
4/9/24 సర్సీ నుండి సోన్ ప్రయాగ.కేదార్ నాధ్
5/9/24 కేదార్ నుండి సర్సి
6/9/24 సర్సీ నుండి బదరీనాద్
7/9/24 బదరీనాద్ నుండి నగరసు
8/9/24 నగరసు నుండి హరిద్వార్
9/9/24 హరిద్వార్
10/9/24 హరిద్వార్ నుండి ఢిల్లీ
ఢిల్లీ నుండి చీరాల
11/9/24 ప్రయాణం
12/9/24 చీరాల నుండి బాపట్ల
ఇదీ ప్రయాణ ప్రణాళిక
గుర్తు గా ఉండటం కోసమే అక్షర బద్దం చేసాను
శుభం
శుభం




No comments:
Post a Comment