Sunday, October 6, 2024

గంగోత్రి गंगोत्री धाम्

 గంగోత్రి 

గఙ్గాఫేనసితా జటా పశుపతేశ్చన్ద్రః సితో మూర్ధని

సో‌உయం సర్వసితో దదాతు విభవం పాపక్షయం సర్వదా


భావము:--శివుని జటాజూటముపైని గంగ నురుగు తెల్లగానూ , తలపైని నెలవంక తెల్లగానూ వుంది మొత్తము శివుడు కూడా తెల్లగా ప్రకాశిస్తూ మనకు వైభవము,పాపక్షయమూ కలిగించు గాక!

—------------------------

  మరుల్లీలాలోలల్లహరి పునానాః సౌరభ్యైః సతతమలినో నిత్యమలినాన్‌

సఖాయో నః సంతు త్రిదశతటినీతీరతరవః








2/9/24రెండో తారీకు ఉదయాన్నే  ధరళిలో ఉన్నటువంటి కల్ప కేదార్ ఆలయాన్ని సందర్శించాము .ఆలయం కిందకి ఉంటుంది. గుడి లో గర్భగుడి లేదు. కేదార్ లాంటి గుడి కింద ఒక పెద్ద ఖాళీ ప్రదేశంలో నీటి అడుగు న శివలింగం.   అక్కడికి చాలా దగ్గరలోనే గంగా నది ప్రవహిస్తూ ఉందిచుట్టూ అంతా యాపిల్ తోటలు.పండ్లు కిందరాలి పడి ఉన్నాయి. యాపిల్ తోటల మధ్యలో నుంచి నడుస్తూ వెళ్లి గంగానది దర్శనం చేసుకున్నాము.స్నానం చేయలేము. చాలా ఉధృతి ఆచమనం చేసి గంగోత్రి కి బయలు దేరాము. ఈరోజు పోలాల అమావాస్య. చాలా మంది స్థానికులు గంగకు పూజలు చేస్తున్నారు.  20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గంగోత్రి కి ఉదయాన్నే ఏడున్నర కల్లా బయలుదేరి వెళ్ళాము . ధరళి లో గంగ దగ్గరగా ఉంది. మరల కొండ ఎక్కుతున్నాము. రెండు వైపులా చీడ్ చెట్లు. చలిగా ఉంది. మధ్యలో కొంచెం వర్షం. మరల ఎండ.ఎండ ఉన్నా చలి ఉంది.దారి అక్కడ అక్కడ పాడైంది. కొండ పడింది. చాలా చోట్ల తాత్కాలికంగా బాగుచేస్తున్నారు. కొన్ని చోట్ల పడటానికి సిద్ధంగా ఉన్నట్లు చెట్లు ఉన్నాయి. జాగ్రత్తగా చూస్తూ ప్రయాణం. జలపాతాలు పలకరిస్తున్నాయి. ఊరిస్తున్నాయి. కానీ రాళ్లు పడతాయి అని దూరం నుంచి చూస్తూ దగ్గర నుండి దాటుతూ సాగుతోంది ప్రయాణం. భయం కాదు కాని ఉద్విగ్న త కలుగుతుంది. కారులో నేరుగా గంగోత్రి దగ్గరికి వెళ్లొచ్చు .ఒక అర కిలోమీటర్ ముందు కార్లు ఆగుతాయి .8.30చేరాము. అక్కడి నుంచి నడుస్తూగంగా నది యొక్క పుట్టుక స్థానంగా చెప్పేటువంటి గంగోత్రి ఆలయానికి చేరాము. గంగోత్రి ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు మధ్యలో కుడివైపున కిందకి దిగితే అక్కడ అక్కడి నుంచి గంగా నది .పెద్దగంట దాని కిందనుంచి గంగ ఒడ్డున ఉన్న స్నానఘట్టాలు. అంతకు ముందు వరదకి అన్నీ కోట్టుకు పోయి రాళ్ళు బెటపడ్డాయి. కొంత ప్రాంతంలో షెడ్లు ఉన్నాయి. అక్కడ గంగకు పూజ చేసాము. అమావాస్య కాలం కలిసి వచ్చింది. పితృ తర్పనం వదిలే అవకాశం కలిగింది. స్నానం చేయడం సాహసమే. వాతావరణం చల్లగా ఉంది. నీరు గడ్డకట్టిచేలా ఉన్నాయి. లఘుస్నానంతో సరి. ఎదురు గా గంగ పైనుంచి వేగంగా చుట్టూ కొండలు. ఎదురు గా కొండలకింద కొన్ని అధునాతన వసతి గృహాలు. కనుచూపు మేర గంగా ప్రవాహం. పరమ పావన మూర్తి గంగ.కదిలి పక్కన రావడం కష్టమే. కొంతసేపు తరువాత పక్కనే ఉన్న  భాగీరథిశిల.ఈప్రాంతమే గంగ భువికి అవతరించి న ప్రదేశం. ఇదితపస్సుచేసిన శిల. గుడి ఉంది దర్శనం చేసుకున్నాము. భగీరథుడు తపస్సు చేసిన ప్రదేశం.  నమస్కరించి గంగోత్రి ఆలయానికి వెళ్ళాము. మేము వెళ్లే సమయానికి సరిగా 9:00 భోగ్  సమయం. నివేదన సమయం.  ఒక పావుగంట గుడి గుడి తీసిన తర్వాత దర్శనం చేసుకున్నాము చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉన్నటువంటి విగ్రహం. ప్రథాన విగ్రహం పక్కన మూడు విగ్రహాలు.తెల్లనిఆలయం.  వాతావరణం బాగా చల్లగా. గుడి ముందుకు మేఘాలు వచ్చాయి. కొంచెం రద్దీ పెరిగింది. ఆలయం ఎదురుగా  అఖండ ధుని.లోపల వెచ్చగా ఉంది.  అక్కడే కూర్చున్నాము కొంచెం సేపు.మరల అమ్మవారి దర్శనం  దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని మరలా గంగా నది వైపు వెళ్ళాము. గంగా నీరు తీసుకుని మరల దర్శనానికి వెళ్లి దర్శనం చేసుకుని పునర్దర్శనంకలగాలని ప్రార్ధించాము. పక్కనే  శివుని ఆలయం ఉంది శివాలయంలోకి వెళ్లి అక్కడ శివునికి గంగతో అభిషేకం  చేసాము. చూస్తూ 11:00 కల్లా కారు దగ్గరికి చేరుకున్నాము.నడవలేని వారికి వీల్ ఛైర్ సౌకర్యం ఉంది. దారి అంతా రెండు వైపులా దుకాణాలు. పూజా సామగ్ర. రుద్రాక్ష మాలలు. ఇతరములు. బాగా చల్లని వాతావరణం.వాతావరణం లో ఆధ్యాత్మిక త ప్రశాంతత.అనిర్వచనీయమైన అనుభూతి. మార్గమధ్యంలో గోముఖానికి వెళ్ళే దారి కనిపించింది. గుర్రాలమీద ప్రయాణం రెండు రోజులు పడుతుంది ట. గంగ పుట్టిన గంగా గ్లేసియర్ .అక్కడ గోముఖం వంటి ఒక ప్రాంతంనుండి గంగ వస్తుంది. గంగోత్రి ఆలయం దగ్గర రెండు పెద్ద స్క్రీన్ లపై చూపుతున్నారు. ఇప్పటికి ఇంతే. చుట్టూ కొండలు చూస్తూ  నుంచి మరలా తిరుగు ప్రయాణం.ఇక్కడి  మూడు కి మి దూరంలో జాహ్నవి నది గంగలో కలుస్తుంది. 12.00గంటలకు మేమున్నటువంటి  ధరళి  తిరిగి వచ్చాము. ఆరోజు అక్కడి నుంచి మేము తిరిగి కేదార్ నాధ్ కి ప్రయాణం. నంద ప్రయాగ దగ్గర రోడ్డు మూసివేసారు. ఉత్తర కాశీ  గుప్తేశ్వర్ మీదుగా ఆరోజు సాయంకాలం 7.30గంటలకు ఘరశాలీ. చేరాము.ఘర్శాలీ

రాత్రి7.30

వాతావరణం పొడి గా ఉంది

గంగ పక్కనే

ఇక్కడ గంగ ఎదురు ప్రవహిస్తోంది అని మనుశర్మ చెప్పాడు. నాకు పల్లంకి ప్రవహిస్తోంది అని అని అనిపించింది.నిజమే గా. నీరు పల్లానికేఎపుడూ

    అంటే ఇంతవరకు మేము కొండ ఎక్కుతూ గంగానది ప్రవహించేటువంటి ప్రవాహానికి ఎదురుగా వెళుతూ ఉంటాము. ఈ ప్రాంతంలో మాత్రం గంగా నది కిందకు ప్రవహిస్తూ ఉంటుంది .అంతే.  రాత్రికి అక్కడే విశ్రాంతి. దాదాపుగా 7 గంటలు ప్రయాణం 270 కిమీ .గంగోత్రి 3140 మీ ఎత్తున ఉంది అక్కడ నుండి   నుంచి  శ్రీనగర్(579 మీ ఎత్తు) వరకు కిందకి ప్రయాణం. కొండదిగటం మరో కొండ ఎక్కడం సహజం .మరల శ్రీనగర్ నుండి ఎత్తు కి వెలడం మొదలు  .చిన్నగా చలి పెరుగుతుంది .దారి అనూహ్య మలుపు లు గతుకులు , వర్షం. ప్రయాణం మరపురాని అనుభవం. ఎక్కువగా రద్దీ లేని మార్గంలో శ్రీనగర్ చేరాము అక్కడి నుంచి  కేదార్ మార్గం శ్రీనర్ నుండి రద్దీ పెరిగింది. రోడ్లు వెడల్పు గా ఉన్నాయి. కానీ చాలా చోట్ల రోడ్డు కొట్టుకు పోయింది. తాత్కాలిక ఏర్పాటు గా దారి చేసారు. ..రాత్రి భోజనం చేసి పడుకున్నాము.  కేదార్ యాత్ర  నిన్న టి1/9/2024 నుండిఆపారు. సోన్ ప్రయాగ దగ్గర కొండ పడింది.

No comments:

Post a Comment